LOADING...
Godavari: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక 
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక

Godavari: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది : రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2025
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా అధికారులు బుధవారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీరు 48 అడుగుల ఎత్తులో ఉండగా,గురువారం ఉదయం నాటికి 50 అడుగులను మించి ప్రవహించడం ప్రారంభించింది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో అనేక మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భద్రాచలంలోని కల్యాణ కట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. అదే సమయంలో స్నానఘట్టాల పరిసరాల్లోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగిపోయాయి.

వివరాలు 

మోటార్లను అమర్చి మురుగు నీటిని బయటకు..

పట్టణంలోకి వరద ప్రవేశించకుండా గోదావరి కరకట్ట వద్ద ఉన్న స్లూయిజ్‌లను అధికారులు మూసివేశారు. దీంతో పట్టణం నుంచి మురుగునీరు బయటకు వెళ్లకపోవడంతో సమస్యలు తలెత్తాయి. దీనికి పరిష్కారంగా అధికారులు మోటార్లను అమర్చి మురుగు నీటిని బయటకు పంపిస్తున్నారు. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తూనే ఉండటంతో రాబోయే గంటల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.