Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..!
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు పెట్టేందుకు గ్రోదెజ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఏకంగా రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు గోద్రెజ్ సంస్థతో కీలక చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. మొదటగా రూ.500 కోట్లు, తర్వాతి దశలవారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ఎండీ నాదిర్ గోద్రెజ్ నేతృత్వంలోని బృందంతో జరిగిన సమావేశంలో ఈ తీర్మాణాలు జరిగాయి. పెట్టుబడులతో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలిసింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచేలా చర్చలు
మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్-ఆయిల్ ఫామ్ను రాష్ట్రానికి వర్తింప చేయడంపై కూడా చర్చలు జరిగాయి. విశాఖలో పురుగు మందుల తయారీ పరిశ్రమలు, రోయ్యల మేతపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు వంటి అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచేలా వ్యవసాయ, ఆక్వా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న అవకాశాలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు.