NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gold ATM: తిరుపతిలో ఆకట్టుకుంటున్న గోల్డ్ ఏటీఎం.. కార్డు స్వైప్ చేసి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వస్తాయి..
    తదుపరి వార్తా కథనం
    Gold ATM: తిరుపతిలో ఆకట్టుకుంటున్న గోల్డ్ ఏటీఎం.. కార్డు స్వైప్ చేసి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వస్తాయి..

    Gold ATM: తిరుపతిలో ఆకట్టుకుంటున్న గోల్డ్ ఏటీఎం.. కార్డు స్వైప్ చేసి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ వస్తాయి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 18, 2025
    05:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలంటే మనం ఎప్పుడూ జ్యువెలరీ షాపులకు వెళ్లాల్సి వస్తుంది.

    బులియన్ మార్కెట్ ధరకన్నా ఎక్కువ ధరలు చెల్లించాలి, అది మనకు మరింత భారంగా మారుతుంది.

    ఆభరణాలు కొనుగోలు చేస్తే, వాటిపై కూలీ, తరుగు వంటి అదనపు చార్జీలను కూడా వసూలు చేస్తారు.

    చివరికి మనం కొనుగోలు చేసిన బంగారంపై 24 క్యారెట్ బంగారం ధరను తీసుకుని, మనకు కేవలం 18 క్యారెట్ లేదా 22 క్యారెట్ జ్యువెలరీని ఇస్తారు.

    ఇలాంటి టెన్షన్ లేకుండా... బంగారం బిస్కెట్‌లు లేదా కాయిన్స్ రూపంలో కొనుగోలు చేయడం సరైనది.

    వివరాలు 

    తిరుమల శ్రీవారి ఆలయంలో గోల్డెన్ ఏటీఎం సేవలు

    హిరణ్యని బులియన్ ప్రైవేట్ లిమిటెడ్,ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

    తరుగు, కూలీ లేని బంగారు కాయిన్స్‌ను నేటి మార్కెట్ ధరకే కొనుగోలు చేసేలా ఈ సంస్థ ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించింది.

    దీని ఫలితంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోల్డెన్ ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    తిరుపతిలో జరుగుతున్న ఐటీసీఎక్స్‌లో గోల్డెన్ ఏటీఎం సందర్శకులను, వక్తలను విశేషంగా ఆకట్టుకుంది.

    మనం రోజువారీగా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ఏటీఎంలను ఉపయోగిస్తుంటాము, అలాగే ఈ కొత్త ఏటీఎం ద్వారా బంగారం, వెండి కాయిన్స్‌ను కూడా పొందవచ్చు.

    వివరాలు 

    ఏటీఎం 5 కిలోల వరకు బంగారు నిల్వ ఉంచగలదు

    మనం ఏటీఎం కార్డు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డును యూజ్ చేసి, ఇష్టమైన బంగారు కాయిన్స్ లేదా సిల్వర్ కాయిన్స్‌ను పొందవచ్చు.

    ఈ ప్రక్రియ ద్వారా, మీరు కొనుగోలు చేసిన కాయిన్స్ ప్యాకింగ్ చేయబడిన తర్వాత ఏటీఎం ద్వారా మీకు అందజేయబడతాయి.

    ఈ ఏటీఎం 5 కిలోల వరకు బంగారు నిల్వ ఉంచగలదు, ఇందులో 0.5 గ్రాముల నుంచి 5 గ్రాముల బంగారు కాయిన్స్ లేదా 5 గ్రాముల నుంచి 50 గ్రాముల వెండి కాయిన్స్ వరకు అందుబాటులో ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    తిరుమల తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం టెక్నాలజీ
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    తిరుమలో భద్రతా లోపం: 'ఆనంద నిలయం' దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు  తిరుపతి
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025