NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CBSE Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!
    తదుపరి వార్తా కథనం
    CBSE Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!
    సీబీఎస్‌ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!

    CBSE Exams: సీబీఎస్‌ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. ఇక ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2025
    01:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యార్థులకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇకపై విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయొచ్చని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.

    అన్నీ అనుకున్నట్లు సాగితే, ఈ విధానం 2026 నుంచే అమల్లోకి రానుంది.

    ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నేతృత్వంలో మంగళవారం స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి, సీబీఎస్‌ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్‌) ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.

    దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసి, వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నారు

    Details

    విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశం

    ఈ విధానం అమలులోకి వస్తే, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గనుంది.

    అలాగే వారు తమ మార్కులను మెరుగుపర్చుకునే అవకాశాన్ని పొందగలరు. అంతేకాకుండా 2026-27 విద్యా సంవత్సరంలో గ్లోబల్‌ కరిక్యులమ్‌ కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీబీఎస్‌ఈ భావిస్తోంది.

    దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో ఒకే విధమైన సిలబస్‌ అమలులోకి వస్తుంది.

    ఏడాదికి రెండు సార్లు నిర్వహించే బోర్డు పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చిన పరీక్ష ఫలితాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే రెండు పరీక్షలకు హాజరవ్వడం పూర్తిగా విద్యార్థుల ఐచ్ఛికమే.

    జేఈఈ మాదిరిగానే పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరవ్వొచ్చు.

    Details

    2026 నుంచి అమలు

    ప్రస్తుతం సీబీఎస్‌ఈ పదో, పన్నెండో తరగతి పరీక్షలు ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించి, మే నెలలో ఫలితాలను విడుదల చేస్తున్నారు.

    ఫెయిలైన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, ఆ పరీక్షను రీ-టేక్‌ చేయడానికి అవకాశం ఉంది. అయితే కొత్త విధానం అమల్లోకి వస్తే, రెండు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది.

    అండర్‌ గ్రాడ్యుయేషన్‌ (యూజీ) ప్రవేశాలపై ఈ కొత్త విధానం ప్రభావం లేకుండా విద్యా క్యాలెండర్‌ను సరిచేయనున్నారు.

    దీని ద్వారా, విద్యార్థులు మరింత సమర్థవంతంగా పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశం పొందనున్నారు. 2026 నుంచి అమలు కోసం కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ధర్మేంద్ర ప్రధాన్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ధర్మేంద్ర ప్రధాన్

    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    డీమ్డ్‌ విశ్వవిద్యాలయం హోదాకు నయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేంద్రమంత్రి
    కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఏడాదికి రెండు బోర్డ్ ఎగ్జామ్స్  విద్యా శాఖ మంత్రి
    Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు  విద్యా శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025