NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు

    DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 2% పెంపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 28, 2025
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్‌ అలవెన్సును (DA) 2 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడారు.

    పెరిగిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సవరణతో డీఏ మొత్తం బేసిక్‌ శాలరీలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరుగనుంది.

    దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం పెరగనుంది.

    Details

    66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం

    డీఏ పెంపు వల్ల 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది.

    గతంలో 2023 జులైలో డీఏను 50 శాతం నుంచి 53 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. సాధారణంగా కేంద్రం ప్రతి ఏడాది రెండుసార్లు డీఏను సవరిస్తూ ఉంటుంది.

    పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునేలా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు.

    Details

    నాన్-సెమీ కండక్టర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు భారీ ప్రోత్సాహం 

    కేంద్ర ప్రభుత్వం నాన్-సెమీ కండక్టర్‌ ఎలక్ట్రానిక్‌ విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం కింద ఈ రంగాన్ని చేర్చింది.

    ఇందుకోసం కేంద్రం వచ్చే ఆరు సంవత్సరాల్లో రూ. 22,919 కోట్లు వెచ్చించనుంది. ఈ నిర్ణయం ద్వారా దేశీయంగా భారీ పెట్టుబడులు ఆకర్షించే అవకాశం ఉంది.

    ఈ పథకం వల్ల సుమారు రూ. 59,350 కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు.

    దీని ద్వారా ప్రత్యక్షంగా 91,000 మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

    Details

    ఖరీఫ్‌ సీజన్‌ కోసం రూ. 37,216 కోట్ల ఎరువుల సబ్సిడీ

    ఖరీఫ్‌ సీజన్‌ (ఏప్రిల్‌ 1 - సెప్టెంబర్‌ 30)లో వ్యవసాయ ఉత్పత్తికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీని ప్రకటించింది.

    పొటాష్‌, పాస్ఫేట్‌ ఫెర్టిలైజర్లకు రూ. 37,216 కోట్ల సబ్సిడీ కింద చెల్లించేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గి, పంట ఉత్పత్తిలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది.

    ప్రభుత్వం ఎరువుల ధరలను నియంత్రించి, రైతులకు భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర కేబినెట్
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    కేంద్ర కేబినెట్

    సిలిండర్‌పై సబ్సిడీ రూ.300కి పెంపు.. తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు కేంద్రం ఆమోదం  వంటగ్యాస్ సిలిండర్
    కేంద్రం ఉద్యోగులకు 4శాతం డీఏ.. గోధుమకు రూ.150 మద్దతు ధర పెంపు  అనురాగ్ సింగ్ ఠాకూర్
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  తాజా వార్తలు
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  నరేంద్ర మోదీ

    అశ్విని వైష్ణవ్

    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025