NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. వారికి ఇక పండగే
    తదుపరి వార్తా కథనం
    Telangana: డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. వారికి ఇక పండగే
    డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.

    Telangana: డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. వారికి ఇక పండగే

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2024
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

    ముఖ్యంగా వ్యవసాయ,మహిళా సంక్షేమం కోసం కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతున్నారు.

    ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్న హామీ ఇచ్చి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే వాటిపై సంతకం చేశారు.

    ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేయడం జరిగింది.

    తాజాగా డ్వాక్రా మహిళలకు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ, శుభవార్తను పంచారు.

    వివరాలు 

    పాలకుర్తిలో ఓ మహిళకు మొదటి ఎలక్ట్రిక్ ఆటో పంపిణీ

    తెలంగాణ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆటోలను అందించేందుకు సిద్ధమవుతోంది.

    జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు మొదటి ఎలక్ట్రిక్ ఆటోను పంపిణీ చేశారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు లేదా వారి కుటుంబంలో లైసెన్స్ ఉన్న వారికి ఈ ఆటోలు అందించనున్నారు.

    ఈ ఆటోలను ప్రభుత్వం స్త్రీనిధి రుణం ద్వారా కొనుగోలు చేసి ఇస్తోంది. అయితే రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

    ఇంకా, ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుపై సర్కార్ అధ్యయనం చేస్తోంది. డ్వాక్రా మహిళలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు.

    వివరాలు 

    రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ

    గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టో, ఆరు గ్యారెంటీ పథకాలపై విశ్వాసం ఉంచి, బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు.

    ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు.

    రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.

    మహిళల సాధికారత కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ఆర్థికాభివృద్ధి పెంచేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    తెలంగాణ

    Heavy Rains: తెలంగాణ, ఏపీ మధ్య నిలిచిపోయిన వాహన రాకపోకలు  ఆంధ్రప్రదేశ్
    Effect of rains: భారీ వర్షాలు.. ఒకే జిల్లాలో ఐదుగురు మృత్యువాత భారీ వర్షాలు
    Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై  ప్రధాని, అమిత్‌షా ఆరా  నరేంద్ర మోదీ
    Telangana: నేటి పరీక్షలన్నీ వాయిదా.. యూనివర్సిటీల కీలక నిర్ణయం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025