NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!
    తదుపరి వార్తా కథనం
    Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!
    మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!

    Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 20, 2025
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం 10 శాతం తగ్గించే నిర్ణయం తీసుకుంది.

    ఈ తగ్గింపు ఈ నెల 24 నుంచి అమలులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది.

    మెట్రోలో ప్రయాణించే ప్రజలపై వడ్డుబారాన్ని తగ్గించేందుకు, ముఖ్యంగా అల్పాదాయ వర్గాలకు భారమవకుండా చూడాలని ఈ నిర్ణయానికి కారణమైందని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

    గతంలో కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కి, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కి పెంచాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఛార్జీల పెంపుపై నగరంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

    Details

    ఈనెల 24 నుండి అమల్లోకి

    జీహెచ్ ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ ఈ పెంపు నిర్ణయాన్ని వెంటనే తిరస్కరించాలని డిమాండ్ చేశారు.

    పేద, మధ్య తరగతి వర్గాలపై ఈ ఛార్జీల పెంపు ఆర్థిక భారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షాలు కూడా మెట్రో ఛార్జీల పెంపుపై నిరసనలు వ్యక్తం చేసి ఉప్పల్ మెట్రో డిపో వద్ద ధర్నాలు చేపట్టాయి.

    రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

    ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ఛార్జీల పెంపును 10 శాతం తగ్గిస్తూ ఈ నెల 24 నుండి అమలు చేయనుందని ప్రకటించింది.

    దీనివల్ల మెట్రో ప్రయాణికులపై ఉన్న భారాన్ని కొంతమేర తగ్గించగలమని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Stock market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 873 పాయింట్లు, నిఫ్టీ 261 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు! హైదరాబాద్
    New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! కార్
    Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి  బెంగళూరు

    హైదరాబాద్

    Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు నైజీరియా
    HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం తెలంగాణ
    Koheda: కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్‌ నిర్మాణానికి రంగం సిద్ధం.. 199 ఎకరాలు.. రూ.1,901 కోట్లు.. భారతదేశం
    Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ పోలవరం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025