NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!
    తదుపరి వార్తా కథనం
    Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!
    పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!

    Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 10, 2025
    11:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభించనున్నట్లు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.

    సోమవారం ఢిల్లీలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి అమిత్ షాను కలిసిన ఆయన, అధికారిక ఆహ్వాన పత్రాన్ని హోంమంత్రికి అందజేశారు.

    ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు.

    ఈ కార్యాలయం ఏర్పాటు ప్రధానిగా నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి నెరవేరటమేనని తెలిపారు.

    Details

    ఇటీవల జీవో జారీ చేసిన ప్రభుత్వం

    కార్యక్రమం జూన్ నెల చివరి వారంలో జరగనుందని, ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా కీలక పాత్రను పోషిస్తోందని వెల్లడించారు.

    నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసినట్లు గుర్తు చేశారు.

    పసుపు పండించే రైతుల సాధికారత, ఆవిష్కరణ, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాప్యత వంటి అంశాలకు ప్రతీకగా ఈ లోగో నిలుస్తుందని ఎంపీ అర్వింద్ చెప్పారు.

    జాతీయ పసుపు బోర్డు రైతులకు కీలక మలుపుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అంతేగాక, సహకార సంఘాల స్ఫూర్తి, రెతు నేతృత్వంలోని అభివృద్ధిని బలోపేతం చేయడంలో బోర్డు కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిజామాబాద్
    ధర్మపురి అరవింద్
    అమిత్ షా

    తాజా

    Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్‌లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం! నిజామాబాద్
    IAF: 'శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలి'.. శుక్లాకు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శుభాకాంక్షలు  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు తగ్గుముఖం.. వెండి ధరలు నిలకడగా! బంగారం
    Apple: ఆపిల్‌ ఎక్స్‌కోడ్‌కు చాట్‌జీపీటీ అనుసంధానం..! ఆపిల్

    నిజామాబాద్

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    హైదరాబాద్‌లో విషాదం: వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి హైదరాబాద్
    నిజామాబాద్‌: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    నిజామాబాద్ ఉగ్రవాద కుట్ర కేసు: పీఎఫ్‌ఐ వెపన్ ట్రైనర్‌ను అరెస్టు చేసిన ఎన్ఐఏ  ఎన్ఐఏ

    ధర్మపురి అరవింద్

    కేసీఆర్ చనిపోతే రూ.5లక్షలు.. కేటీఆర్ మరణిస్తే రూ.10లక్షలు ఇస్తాం: బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్  బీజేపీ

    అమిత్ షా

    CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే? కేంద్రమంత్రి
     Canada: ఖలిస్తానీ హత్యల వెనుక అమిత్ షా హస్తం.. కెనడా మంత్రి సంచలన ఆరోపణ  కెనడా
    Jharkhand Elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం..  బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి   జార్ఖండ్
    Amit Shah: ఉగ్రవాదాన్ని సమూలంగా ఏరివేయడానికి గొప్ప వ్యూహంతో ముందుకెళ్తున్నాం: అమిత్‌ షా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025