
Dharmapuri Arvind: పసుపు రైతులకు శుభవార్త.. జూన్లో ప్రారంభం కానున్న జాతీయ బోర్డు కార్యాలయం!
ఈ వార్తాకథనం ఏంటి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ కార్యాలయం ప్రారంభించనున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
సోమవారం ఢిల్లీలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి అమిత్ షాను కలిసిన ఆయన, అధికారిక ఆహ్వాన పత్రాన్ని హోంమంత్రికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ... కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యాలయం ఏర్పాటు ప్రధానిగా నరేంద్ర మోదీ ఇచ్చిన హామీకి నెరవేరటమేనని తెలిపారు.
Details
ఇటీవల జీవో జారీ చేసిన ప్రభుత్వం
కార్యక్రమం జూన్ నెల చివరి వారంలో జరగనుందని, ఖచ్చితమైన తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా కీలక పాత్రను పోషిస్తోందని వెల్లడించారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసినట్లు గుర్తు చేశారు.
పసుపు పండించే రైతుల సాధికారత, ఆవిష్కరణ, అంతర్జాతీయ మార్కెట్లో ప్రాప్యత వంటి అంశాలకు ప్రతీకగా ఈ లోగో నిలుస్తుందని ఎంపీ అర్వింద్ చెప్పారు.
జాతీయ పసుపు బోర్డు రైతులకు కీలక మలుపుగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అంతేగాక, సహకార సంఘాల స్ఫూర్తి, రెతు నేతృత్వంలోని అభివృద్ధిని బలోపేతం చేయడంలో బోర్డు కీలక భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.