NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana High Court: కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరు: హైకోర్టు 
    తదుపరి వార్తా కథనం
    Telangana High Court: కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరు: హైకోర్టు 
    కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరు: హైకోర్టు

    Telangana High Court: కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరు: హైకోర్టు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2024
    12:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల నియామకంపై కేబినెట్ సిఫార్సును గవర్నర్ తిరస్కరించలేరని తెలంగాణ హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది.

    కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించిన ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

    గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది.

    అయితే, సుదీర్ఘ జాప్యం తర్వాత గవర్నర్ సిఫార్సును తిరస్కరించారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది.

    తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

    Details 

    తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దన్నహైకోర్టు

    అయితే ఇద్దరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇంతలో ప్రొ.కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ పేర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాకు ప్రతిపాదించింది.

    ఈ ప్రతిపాదనకు వెంటనే గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు.

    అయితే దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ తెలంగాణ హైకోర్టులో దీనిని సవాలు చేశారు.

    దీంతో దాసోజు శ్రవణ్,సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దని హైకోర్టు ఆదేశించింది.

    Details 

    సందిగ్ధంలో నలుగురు అభ్యర్థుల భవితవ్యం 

    తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

    గురువారం నాడు, హైకోర్టు తన తీర్పులో "ఆర్టికల్ 171 (5) ప్రకారం, కేబినెట్ సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని భావించింది.

    దీంతో మొత్తం నలుగురు అభ్యర్థుల భవితవ్యం సందిగ్ధంలో పడింది. మరి, కోర్టు తీర్పుపై స్పష్టత వస్తే తుది ఫలితం తేలనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    తెలంగాణ

    Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి  పద్మశ్రీ పురస్కారాలు
    Vyuham: 'వ్యూహం'పై నిర్ణయం తీసుకొండి..సెన్సార్ బోర్డుకు తెలంగాణ హై కోర్టు హైకోర్టు కీలక ఆదేశాలు..! రామ్ గోపాల్ వర్మ
    Venkatesh Netha: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ  కాంగ్రెస్
    KCR: తెలంగాణ భవన్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన నాయకులు  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025