NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్  ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై 
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్  ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై 
    ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై

    తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్  ఝలక్.. ఎమ్మెల్సీల నియామకాన్ని తిరస్కరించిన తమిళిసై 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 25, 2023
    03:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు)గా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు.

    రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గత కొంత కాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరణకు గురికావడం మరోసారి ఆసక్తికరంగా మారింది.

    గతంలోనూ ఎమ్మెల్సీ కోటా కింద హుజురాబాద్ బీఆర్ఎస్ నేత, పాడి కౌశిక్‌ రెడ్డి అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైంది.

    దాసోజు శ్రవణ్‌, కర్రా సత్యనారాయణ ఇద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు.

    అయితే కళలు, సాహిత్యం, సైన్స్‌ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదని రాష్ట్ర ప్రథమ పౌరురాలు వివరించారు.

    DETAILS

    ఆర్టికల్‌ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు : తమిళిసై

    గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయ్యే అర్హతలు ఈ ఇద్దరి వ్యక్తులకు లేవన్నారు. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదన్నారు.

    కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా ఉన్న దాసోజు శ్రవణ్‌ ఈ మధ్యనే బీజేపీలో చేరారు. అనంతరం, కొద్ది రోజులకే మునుగోడు ఉపఎన్నికకు ముందు జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోవడం గమనార్హం.

    అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు దాసోజు పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ జాబితాకు సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    గతకొంత కాలంగా ఈ ఫైలును తన వద్దే పెట్టుకున్న గవర్నర్, ఆ ఫైలును తిరస్కరిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళసై సౌందరరాజన్
    తెలంగాణ

    తాజా

    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్
    Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు.. సుప్రీంకోర్టు

    తమిళసై సౌందరరాజన్

    తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: సంక్షేమంలో రాష్ట్రం భేష్: గవర్నర్ తమిళసై తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం గవర్నర్
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్ సుప్రీంకోర్టు
    తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం తెలంగాణ

    తెలంగాణ

    తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు  తాజా వార్తలు
    తెలంగాణలో కొత్తగా 20 కేజీబీవీలకు కేంద్రం పచ్చజెండా.. కొత్త విద్యాలయాల జాబితా ఇదే  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం
    కోరుట్లలో తీవ్ర కలకలం.. అనుమానాస్పద స్థితిలో అక్క మృతి, బస్సు ఎక్కి వెళ్లిపోయిన చెల్లెలు కోరుట్ల
    TS Liquor: తెలంగాణలో మద్యం షాపులకు బంపర్ ఆఫర్.. అప్పుపై లిక్కర్ సరఫరాకు గ్రీన్ సిగ్నల్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025