Govinda: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ
ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన గురువారం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేన షిండే వర్గంలో చేరారు. ఆయన ముంబై నార్త్వెస్ట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. నిన్న(బుధవారం)శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం అధికార ప్రతినిధి,మాజీ ఎమ్మెల్యే కృష్ణ హెగ్డేని ఆయన నివాసంలోకలవడంతో గోవిందా రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. గోవింద 2004లో నార్త్ ముంబై లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్పై పోటీ చేశారు. ఇక్కడ నుంచి బీజేపీ సీనియర్ నేత రాంనాయక్పై విజయం సాధించారు. బీజేపీకి కంచుకోటగా భావించే సీటులో గోవింద విజయం సాధించడం విశేషం. ఈ లోక్సభ స్థానంలో బోరివలి,మగాథేన్,చార్కోప్,మలాడ్,దహిసర్,కండివాలి మొదలైన అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.