NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / online frauds: ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను.. దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం అలర్ట్‌!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    online frauds: ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను.. దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం అలర్ట్‌!
    ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను

    online frauds: ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను.. దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం అలర్ట్‌!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    02:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో వేగంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యటనలపై ఇప్పుడు సైబర్‌ నేరగాళ్ల దృష్టి పడింది.

    భక్తిగా యాత్రలకు వెళ్లే పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో మోసాలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.

    ఫేక్‌ వెబ్‌సైట్లు, ఫేస్‌ బుక్‌ పోస్టులు, గూగుల్‌ సెర్చ్‌ ఫలితాల్లో నకిలీ పెయిడ్‌ ప్రకటనలు పెడుతూ యాత్రికులను మోసం చేస్తున్నారు.

    ఈ ఘటనలు కేంద్ర ప్రభుత్వానికి తెలిసిన వెంటనే అప్రమత్తమైంది. ఛార్‌ధామ్‌ యాత్రికులతో పాటు ఇతర ఆధ్యాత్మిక పర్యాటకులే ఈ మోసాల లక్ష్యంగా మారుతున్నారని గుర్తించింది.

    దీనిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (I4C) పౌరులను హెచ్చరిస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

    వివరాలు 

    పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి 

    ఈ ప్రకటన ప్రకారం, పర్యాటక సేవల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఖాతాలు, వాట్సప్‌ నంబర్ల ద్వారా సందేశాలు పంపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిసింది.

    ముఖ్యంగా కేదార్నాథ్‌ యాత్రికుల కోసం హెలికాప్టర్‌ బుకింగ్స్‌, ఛార్‌ధామ్‌ యాత్రికులకు హోటల్‌, అతిథిగృహాల బుకింగ్‌లు, ఆన్‌లైన్‌ క్యాబ్‌, ట్యాక్సీ సేవలు, హాలిడే ప్యాకేజీల పేర్లతో మోసాలు జరుగుతున్నాయని వెల్లడించింది.

    ఈ నకిలీ వెబ్‌సైట్ల ద్వారా సేవల కోసం చెల్లింపులు చేసిన పర్యాటకులకు అనంతరం ఎలాంటి సమాచారం అందకపోవడమే కాకుండా, వారు సంప్రదించిన ఫోన్‌ నంబర్లు స్పందించకుండా ఉంటున్నాయని వివరించింది.

    అందువల్ల ఈ మోసాలను నిరోధించేందుకు పర్యాటకులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

    వివరాలు 

    కేంద్రం అవసరమైన చర్యలు

    ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ద్వారా వస్తున్న లింకులు లేదా 'Sponsored' అని చూపించే లింకులు నొక్కే ముందు అవి నకిలీవా, నిజమైనవా అనేది నిర్ధారించుకోవాలని సూచించింది.

    ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు లేదా నమ్మదగిన ప్రైవేటు ఏజెన్సీల సేవలను మాత్రమే ఉపయోగించాలని సైబర్‌ విభాగం స్పష్టం చేసింది.

    మోసానికి గురైనట్టు అనిపిస్తే వెంటనే cybercrime.gov.in పోర్టల్‌లో లేదా 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని పౌరులకు సూచించింది.

    ప్రజలను మోసపోకుండా చూడటానికి కేంద్రం కూడా గూగుల్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సంస్థలతో కలిసి పని చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    కేంద్ర ప్రభుత్వం

    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? దిల్లీ
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ విదేశాంగశాఖ
    Farmer Protest: నిరసన చేస్తున్న రైతులతో ఫిబ్రవరి 14న కేంద్రం చర్చలు భారతదేశం
    Grants: తెలంగాణకు కేంద్రం నుంచి నిధుల జాప్యం.. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాష్ట్రం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025