NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు 
    ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు

    Chandrababu: ఆక్వా రైతులకు బ్యాంకు రుణాలు - ప్రైవేట్ అప్పుల అవసరం ఉండకుండా చూస్తాం: సీఎం చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 19, 2025
    08:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆక్వా రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రైవేట్ అప్పుల వైపు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా చూడటానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

    "ఆక్వా సాగును శాస్త్రీయ విధానంలో కొనసాగిస్తే అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవు" అని ఆయన హెచ్చరించారు.

    విజయవాడలో గ్లోబల్‌ ఫోరం ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ (జీఎఫ్‌ఎస్‌టీ)ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న"ఆక్వాకల్చర్‌ ఇన్నోవేషన్‌ టెక్‌ 2.0" సదస్సు ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.

    వివరాలు 

     ఆక్వా ఫారాలు, పరిశ్రమలలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి 

    "ఆక్వా రంగం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం, ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ.1.30 లక్షల కోట్ల జీడీపీ రాబడుతున్నా, కాలుష్యం వల్ల తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ప్రత్యేకంగా, ఆక్వా ఫారాలు, పరిశ్రమలలో పెద్ద ఎత్తున సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగాలి" అని ఆయన సూచించారు.

    "ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా కొన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నా.కానీ, త్వరలోనే విద్యుత్ ఛార్జీలతో సహా ఆక్వా రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటాం. ప్రస్తుతానికి రైతులకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలు రూ.3,000 కోట్లే.వీటిని మరింత పెంచేందుకు బ్యాంకులతో చర్చలు జరిపి,ఎక్కువ మొత్తంలో రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

    వివరాలు 

    ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ తప్పనిసరి 

    "రాష్ట్రం నుండి ఎగుమతి అయ్యే ఏ ఉత్పత్తి కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో తిరస్కరించబడకూడదు. రైతులు సీడ్, ఫీడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. యాంటీబయాటిక్స్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలి. అంతేగాక, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

    "ప్రస్తుతం రాష్ట్రంలో 60,000 మంది ఆక్వా రైతులు ఉన్నారు. వీరంతా తమ సాగును అధికారికంగా నమోదు చేసుకోవాలి. అందరూ సహకరించినట్లయితే, రెండు నుంచి మూడు నెలలలోనే జియోట్యాగింగ్ ప్రక్రియ పూర్తిచేయగలం. రక్షణ రంగంలో కూడా ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రక్షణ మంత్రిని అభ్యర్థిస్తాం. విశాఖపట్నంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుపై దృష్టి పెడతాం. మార్కెట్ లింకేజీలను మెరుగుపరచి, స్థానిక మార్కెట్ అవకాశాలను కూడా విస్తరిస్తాం" అని వివరించారు.

    వివరాలు 

    ఆహారమే మందు - వంటగదే ఫార్మసీ 

    "ప్రతి ఇంట్లో తినే ఆహారమే మందుగా మారాలి. వంట గదే ఒక ఫార్మసీలా ఉండాలి. అప్పుడు ప్రజలు డాక్టర్లను ఆశ్రయించే అవసరం తగ్గిపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై సమగ్ర అధ్యయనం చేయిస్తున్నాం" అని చంద్రబాబు వెల్లడించారు.

    ప్రస్తుత సమాజంలో ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్న నేపథ్యంలో, రైతులు అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి అని సూచించారు.

    జీఎఫ్‌ఎస్‌టీ - భాగస్వాములను ఒకే వేదికపైకి తెచ్చింది

    జీఎఫ్‌ఎస్‌టీ ఆధ్వర్యంలో జరిగిన ఆక్వా సదస్సు ద్వారా వివిధ రంగాల భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషకరమని చంద్రబాబు పేర్కొన్నారు.

    మాజీ సీఎస్ ఠక్కర్, కుటుంబరావు, సంజయ్ గుప్తా, రామ్‌రాజ్‌లను ఆయన అభినందించారు.

    వివరాలు 

    టెక్నాలజీ వినియోగంతో పెట్టుబడి తగ్గింపు 

    "టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగిస్తే ఆక్వా రంగంలో పెట్టుబడులు 10% తగ్గి, ఉత్పాదకత 20% పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కృత్రిమ మేధ (AI) ద్వారా చేపలు, రొయ్యల ఆరోగ్య పరిస్థితిని రిమోట్ ద్వారా పర్యవేక్షించగలం. కానీ, నేను ఏఐ (AI) అంటే కొందరు అపార్థం చేసుకుంటున్నారు. నిజమైన ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకుని ఉపయోగించుకోవాలి" అని చంద్రబాబు వివరించారు.

    వివరాలు 

    దిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి చంద్రబాబు హాజరు 

    ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (బుధవారం) సాయంత్రం దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

    దిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో NDA తరఫున చంద్రబాబు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

    సీఎం దిల్లీ వెళుతున్న కారణంగా ఈ నెల 20న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.

    చంద్రబాబు బుధవారం సాయంత్రం 4:55 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దిల్లీకి ప్రయాణం చేయనున్నారు.

    గురువారం సాయంత్రం రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు.

    అదే రోజు సాయంత్రం 6:10 గంటలకు దిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    చంద్రబాబు నాయుడు

    Andra Pradesh: ఏపీ ప్రభుత్వం పింఛన్ పంపిణీపై కొత్త నిర్ణయం.. ఒకరోజు ముందుగానే! ఆంధ్రప్రదేశ్
    CM Chandrababu:గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్
    AP Pensions: ఆంధ్రప్రదేశ్ పెన్షన్‌దారులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్
    Chandrababu: ముఖ్యమంత్రి సహాయ నిధిలోని నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం.. 1,600 మంది పేదలకు లబ్ధి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025