NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Indian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Indian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం
    తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం

    Indian Railways: తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 09, 2025
    05:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుపతి-పాకాల-కాట్పాడి రూట్‌లో రైల్వే డబ్లింగ్‌ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు.

    మొత్తం 104 కిలోమీటర్ల పొడవులో ఉన్న ఈ మార్గంపై డబ్లింగ్‌ పనులు సుమారు రూ.1,332 కోట్ల వ్యయంతో వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

    దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పర్యాటకాభివృద్ధికి గణనీయంగా దోహదం చేస్తుందని చెప్పారు.

    లక్షల సంఖ్యలో పర్యాటకులు ఈ మార్గాన్ని ఉపయోగించే అవకాశముందని పేర్కొన్నారు.

    Details

    14 లక్షల మందికి లబ్ధి

    ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఈ మార్గంలోనే ఉండటంతో, అక్కడి అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని తెలిపారు.

    ఇది కేవలం పర్యాటక అభివృద్ధికే కాకుండా వైద్య, విద్య రంగాలకు కూడా కీలకమైందని చెప్పారు. తిరుపతి-వెల్లూరు మార్గం ద్వారా అనేక ప్రజలకు మెరుగైన వసతులు అందనున్నాయని వెల్లడించారు.

    డబ్లింగ్‌ పనులు పూర్తయ్యితే, 400 గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 14 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరనుందని వివరించారు.

    అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశముండి, ఏటా 4 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయగల సామర్థ్యం ఏర్పడుతుందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుపతి
    ఇండియా

    తాజా

    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం
    Vibhu Raghave : ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో యువ నటుడు మృతి బాలీవుడ్
    Disney: వాల్ట్ డిస్నీలో మళ్లీ ఉద్యోగాలపై వేటు.. ఫిల్మ్‌, టీవీ, ఫైనాన్స్ విభాగాల్లో భారీ తొలగింపులు డిస్నీ
    Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ టైమ్ అనౌన్స్‌మెంట్! ప్రభాస్

    తిరుపతి

    Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి  తిరుమల తిరుపతి
    తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ లగేజీ నిర్వహణ టీటీడీ
    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు  ఎన్ఐఏ
    చంద్రగిరిలో 'నిజం గెలవాలి' యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి  నారా భువనేశ్వరి

    ఇండియా

    Bomb Attack: బీహార్‌లో స్కూల్‌పై బాంబు దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్! బిహార్
    T- SAFE App: సురక్షిత ప్రయాణానికి 'టీ-సేఫ్‌'.. 35 వేలకుపైగా ప్రయాణాలకు భద్రతా వలయం! తెలంగాణ
    Jammu and Kashmir: ఏప్రిల్ 1 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జమ్ముకశ్మీర్
    Grenade Attack: అమృత్‌సర్‌లో గుడిపై గ్రేనేడ్ దాడి.. భయాందోళనలో భక్తులు అమృత్‌సర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025