Page Loader
Rythu bharosa: రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం!
రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం!

Rythu bharosa: రైతుభరోసాకు మార్గదర్శకాలు విడుదల.. ప్రతి ఎకరాకూ రూ.12 వేలు సాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఎకరాకు రూ.12,000 పెట్టుబడి సాయాన్ని రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ సాయం భూభారతి పత్రికలో నమోదు చేసిన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. భూవిస్తీర్ణాన్ని ఆధారంగా తీసుకొని పట్టాదారులకు ఈ సాయాన్ని అందజేస్తారు. అదేవిధంగా, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులకు కూడా ఈ సాయం వర్తిస్తుంది.

Details

రైతు భరోసా ఉత్తర్వులను తెలుగులో విడుదల చేసిన ప్రభుత్వం

సాగు యోగ్యం కాని భూములను రైతుభరోసా సాయం పరిధి నుంచి తొలగించనున్నారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కార బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. రైతుభరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో విడుదల చేసింది. రైతులు సులభంగా అర్థం చేసుకునేలా తీర్చిదిద్దింది.