NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / GBS Outbreak in Maharashtra: 207కి పెరిగిన గ్విలియన్-బారే సిండ్రోమ్ కేసులు..  
    తదుపరి వార్తా కథనం
    GBS Outbreak in Maharashtra: 207కి పెరిగిన గ్విలియన్-బారే సిండ్రోమ్ కేసులు..  
    207కి పెరిగిన గ్విలియన్-బారే సిండ్రోమ్ కేసులు..

    GBS Outbreak in Maharashtra: 207కి పెరిగిన గ్విలియన్-బారే సిండ్రోమ్ కేసులు..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS)వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది.

    ఇప్పటివరకు ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 207 కు చేరుకుంది.

    ఫిబ్రవరి 14న మరో ఇద్దరు అనుమానిత రోగులు గుర్తించబడ్డారు. ఆరోగ్య శాఖ ప్రకారం, మొత్తం బాధితుల్లో 180మంది GBSకు నిర్ధారణ పొందారు,మిగిలిన రోగుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నాయి.

    వారికి అవసరమైన చికిత్స అందించబడుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది. GBS కారణంగా ఇప్పటివరకు 9 మంది మరణించగా,వారిలో 4 మంది ఈ వ్యాధి ప్రభావంతో మరణించారని నిర్ధారించారు.

    మిగిలిన వారు అనుమానిత GBS రోగులుగా నమోదయ్యారు.ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది.

    గిలియన్-బారే సిండ్రోమ్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి,ఇందులో శరీరరోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది.

    వివరాలు 

    పూణే,పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల నుండి ఎక్కువ కేసులు 

    ఈ వ్యాధి నరాలను దెబ్బతీసి కండరాల బలహీనత,జలదరింపు,పక్షవాతం వంటి సమస్యలకు దారితీస్తుంది.

    ఈ వ్యాధి కేసులు ప్రధానంగా పూణే,పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల నుండి ఎక్కువగా వచ్చాయి.

    సాధారణంగా బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణలు GBS కి దారితీస్తాయి,ఎందుకంటే అవి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.

    ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల్లో శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోవడం,కండరాలు బలహీనపడటం,చేతులు,కాళ్లలో తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

    రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం పూణే, పరిసర ప్రాంతాలకు చెందినవే.

    ఈ వ్యాధి వ్యాప్తికి కలుషిత నీటి వనరులే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.

    కలుషితమైన ఆహారం,నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా కూడా ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    మహారాష్ట్ర

    Maharastra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై నేడు నిర్ణయం, మహాయుతి నేతలతో అమిత్ షా సమావేశం భారతదేశం
    Maharastra: మహారాష్ట్ర క్యాబినెట్‌లో సగం బెర్త్‌లు బీజీపీ తీసుకునే అవకాశం.. షిండే వర్గానికి మూడు కీలక మంత్రి పదవులు  భారతదేశం
    Maharashtra: అమిత్ షాతో మహాయుతి నేతలు భేటీ; త్వరలో సీఎం ప్రకటన భారతదేశం
    Maharastra: మహారాష్ట్రలో బస్సు బోల్తా.. 10 మంది మృతి, పలువురికి గాయలు  రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025