GBS Outbreak in Maharashtra: 207కి పెరిగిన గ్విలియన్-బారే సిండ్రోమ్ కేసులు..
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS)వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది.
ఇప్పటివరకు ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 207 కు చేరుకుంది.
ఫిబ్రవరి 14న మరో ఇద్దరు అనుమానిత రోగులు గుర్తించబడ్డారు. ఆరోగ్య శాఖ ప్రకారం, మొత్తం బాధితుల్లో 180మంది GBSకు నిర్ధారణ పొందారు,మిగిలిన రోగుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నాయి.
వారికి అవసరమైన చికిత్స అందించబడుతోందని ఆరోగ్య శాఖ తెలిపింది. GBS కారణంగా ఇప్పటివరకు 9 మంది మరణించగా,వారిలో 4 మంది ఈ వ్యాధి ప్రభావంతో మరణించారని నిర్ధారించారు.
మిగిలిన వారు అనుమానిత GBS రోగులుగా నమోదయ్యారు.ఫిబ్రవరి 13న కొల్హాపూర్ నగరంలో 9వ మరణం సంభవించింది.
గిలియన్-బారే సిండ్రోమ్ అనేది అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి,ఇందులో శరీరరోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది.
వివరాలు
పూణే,పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల నుండి ఎక్కువ కేసులు
ఈ వ్యాధి నరాలను దెబ్బతీసి కండరాల బలహీనత,జలదరింపు,పక్షవాతం వంటి సమస్యలకు దారితీస్తుంది.
ఈ వ్యాధి కేసులు ప్రధానంగా పూణే,పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల నుండి ఎక్కువగా వచ్చాయి.
సాధారణంగా బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణలు GBS కి దారితీస్తాయి,ఎందుకంటే అవి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.
ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల్లో శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోవడం,కండరాలు బలహీనపడటం,చేతులు,కాళ్లలో తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం పూణే, పరిసర ప్రాంతాలకు చెందినవే.
ఈ వ్యాధి వ్యాప్తికి కలుషిత నీటి వనరులే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.
కలుషితమైన ఆహారం,నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా కూడా ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందని అంచనా వేస్తున్నారు.