Page Loader
దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్
దూసుకొస్తున్న బీపర్‌జోయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్

దూసుకొస్తున్న బిపోర్‌జాయ్ తుపాను; గుజరాత్ తీర ప్రాంతాల్లో హై అలర్ట్

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

తూర్పు-మధ్య అరేబియా సముద్రం తీరంపై బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దూసుకొస్తున్న తుపాను మరికొద్ది గంటల్లో గుజరాత్ తీరాన్ని తాకనుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తుపానును ఎదుర్కొనేందుకు హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ ఆదివారం రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ను సందర్శించి తుపానుకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల సన్నద్ధతను సమీక్షించారు. బిపోర్‌జాయ్ తుపాను అత్యంత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో గురువారం గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్ర, అలాగే పాకిస్థాన్‌లోని కరాచీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.

తుపాను

సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతంలో ఎల్లో అలర్ట్ జారీ

గుజరాత్ ముఖ్యమంత్రి బాధిత ప్రాంతంలోని అధికారులందరితో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, డీజీపీ వికాస్‌ సహాయ్‌, రిలీఫ్‌ కమిషనర్‌ అలోక్‌ పాండే, రెవెన్యూ శాఖ, ఇంధన శాఖ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని శాఖాధిపతులతో ప్రాథమిక చర్చల అనంతరం, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మరోవైపు, సౌరాష్ట్ర, గుజరాత్‌లోని కచ్ తీర ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. థానే, ముంబై, పాల్‌ఘర్‌లలో ఐఎండీ ముందస్తు హెచ్చరికలను జారీ చేసింది. అలాగే జూన్ 11 నుంచి జూన్ 14 వరకు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.