NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు
    తదుపరి వార్తా కథనం
    జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు
    జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు

    జాక్‌పాట్ కొట్టిన హరిత కర్మసేన మహిళలు.. ఏకంగా రూ.10 కోట్లు గెలిచారు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 28, 2023
    12:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మున్సిపాలిటీలో ఓ సంస్థ తరుపున పనిచేసే మహిళలకు జాక్ పాట్ తగిలింది. రూ.250 పెట్టి లాటరీ టికెట్టు కొన్న 11 మంది మహిళలకు రూ.10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది.

    కేరళలోని పరప్పన్‌గడి మున్సిపాలిటీలో హరిత కర్మసేన తరుపున పనిచేసే మహిళలకు ఈ అదృష్టం వరించింది.

    ఈ కర్మసేన్ కు చెందిన మహిళలంతా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రిసైక్లింగ్ ప్లాంట్ కు తరలిస్తారు. అలా వచ్చిన ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నారు.

    ప్రభుత్వం నిర్వహించే లాటరీలో వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నారు. దీని కోసం గ్రూపులో ఉన్న 11 మంది మహిళలు చందాలు వేసుకొని రూ.250 జమ చేసి వాటితో ఓ లాటరీ టికెట్ కొన్నారు.

    Details

    సంతోషం వ్యక్తం చేసిన నిరుపేద మహిళలు

    కేరళ లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా ఇందులో ఆ మహిళలకు రూ.10 కోట్ల విలువైన మానసూన్ బంపర్ లాటరీ దక్కింది. దీంతో ఆ నిరుపేద మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

    రాత్రికి రాత్రే వారు కోటీశ్వరులు కావడంతో వారి బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    కేరళ లాటరీ వల్ల కుటంబంలోని సమస్యలు తీరుతాయని, ఆ డబ్బును 11 మంది సమానంగా పంచుకుంటామని మహిళలు వెల్లడించారు.

    అదే విధంగా కేరళ లాటరీ మహిళలకు తగలడంతో కొందరు మున్సిపల్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కేరళ

    చిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత ముంబై
    రన్‌వేని తాకిన విమానం తోక భాగం; తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ తిరువనంతపురం
    ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌ టెక్నాలజీ
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025