NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి
    తదుపరి వార్తా కథనం
    మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి
    తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి

    మందుల కోసం వెళ్తే కారుకు నిప్పు.. తృటిలో కుమార్తెతో కలిసి తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 03, 2023
    05:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాలో చెలరేగిన హింస రావణకాష్టంలా మారుతోంది.తాజాగా అల్లరి మూకలు నుహ్‌లో ఓ కారుకు నిప్పు అంటించారు.

    అయితే సదరు కారులో మహిళా న్యాయమూర్తి, ఆమె కుమార్తె ప్రయాణిస్తున్నారు.ఈ క్రమంలోనే వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

    మహిళా అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అంజలి జైన్,తన కుమార్తెతో ప్రయాణిస్తున్న కారుకు దుండగులు నిప్పంటించారు.ఘటనలో ఇరువురూ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

    ఓ గుంపు వీరి కారుపై రాళ్లు రువ్వుతూ కాల్పులు జరిపారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు లంకించికున్నట్లు నుహ్ ఠాణాలో నమోదైన ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది.

    దుండగుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓల్డ్ బస్టాండ్‌లోని ఓ వర్క్ షాప్‌లో కొద్ది సేపు వేచి ఉన్నారు. తర్వాత పలువురు లాయర్లు వీరిని కాపాడినట్లు సమాచారం.

    DETAILS

    మందులు కొనేందుకు వెళ్తే కారును తగలబెట్టారు 

    సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అంజలీ జైన్ తన కుమార్తెతో పాటు అంగరక్షకుడితో కలిసి వోక్స్ వ్యాగన్ కారులో మందులు కొనేందుకు నల్హర్‌లోని SKM వైద్య కళాశాలకు వెళ్లారు.

    2 గంటలకు తిరిగి వస్తుండగా దిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో 150కిపైగా అల్లరి మూకలు వారిపై రాళ్లు రువ్వుతూ దాడికి పూనుకున్నాయి.

    ప్రాణాల కోసం బాధితులు పరుగెత్తారు. దీంతో కారును అల్లరి మూకలు తగులబెట్టినట్లు FIRలో పొందుపర్చారు. ఘటనలో పాల్గొన్న నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

    విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపును అడ్డగించే క్రమంలో నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణలకు ఇప్పటికీ అడ్డుకట్ట పడలేకపోవడం ఆందోళనకరంగా మారింది.

    EMBED

    నిందితులను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు

    Accused arrested by the Police in connection with the recent violence in Nuh, Haryana being taken to the Court. pic.twitter.com/wZ3rmGFzDy— ANI (@ANI) August 3, 2023

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    హర్యానా

    ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ భారతదేశం
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్
    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025