NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం
    హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం

    HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 05, 2025
    09:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు.

    నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమె మంత్రి వర్గ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు.

    ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

    హెచ్‌సీయూ భూముల విషయంలో తాజా పరిణామాలను చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో సమావేశం కానున్నారు.

    Details

    విద్యార్థి నాయకులతో చర్చలు

    విద్యార్థి ఉద్యమాల ప్రతినిధులతో చర్చలు జరిపి భూముల వివాదంపై కాంగ్రెస్ వైఖరిని స్పష్టంగా సమీక్షించనున్నారు.

    ఇక కంచ గచ్చిబౌలి భూముల వివాదంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్‌సీయూ భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తోంది.

    ఈ క్రమంలో ఇటీవల సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి మధ్య కీలక సమావేశం జరిగింది.

    ఇప్పటికే భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్న మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

    ప్రభుత్వం ఇప్పటికే కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది.

    Details

    పర్యావరణ కార్యకర్తలతో భేటీ

    దీనికి అనుగుణంగా సీఎస్ శాంతికుమారి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, అటవీ, హెచ్ఎండీఏ వంటి శాఖల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

    త్వరలో విద్యార్థి సంఘాలు, పౌర సమాజ ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలతో కమిటీ భేటీ కానుంది.

    ఈ నెల 16లోపు నివేదికను సమర్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం నేపథ్యంలో సీఎస్ నివేదిక సిద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.

    మరోవైపు కంచ గచ్చిబౌలిలో ఎకో పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ప్రాంత అభివృద్ధితోపాటు భూవివాదాలకు శాశ్వత పరిష్కారం దొరకొచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    హైదరాబాద్

    Cyber Crime: డిజిటల్ ట్రేడింగ్ ముసుగులో భారీ మోసం.. 52 మంది అరెస్టు సైబర్ నేరం
    GBS case: హైదరాబాద్‌లో గులియన్‌ బారే సిండ్రోమ్‌ తొలి కేసు నమోదు భారతదేశం
    MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం!  తెలంగాణ
    Hyderabad: మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు! భారతదేశం

    తెలంగాణ

    Rain Alert: ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు వాతావరణ శాఖ
    Telangana Bjp: తెలంగాణ బీజేపీకి చీఫ్ ఎవరు? కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆసక్తికరం! బీజేపీ
    Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి! ఇండియా
    Telangana: తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025