NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Power consumption: భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Power consumption: భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం
    భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం

    Power consumption: భారీగా విద్యుత్తు కొనుగోలు.. 65 రోజుల్లో రూ.40 కోట్ల వ్యయం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు రోజువారీ డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతోంది. శుక్రవారం మరోసారి అత్యధిక డిమాండ్‌ నమోదైంది.

    నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు డిస్కంలు భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్‌)లో భారీ స్థాయిలో విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాయి.

    గత డిసెంబరు 1 నుంచి ఈ నెల 3 వరకూ 65 రోజుల్లో మొత్తం 5,405.23 మిలియన్‌ యూనిట్ల (మి.యూ.) కరెంటును కొనుగోలు చేశాయి.

    ఒక్కోరోజు అధిక డిమాండ్‌ సమయాల్లో యూనిట్‌కు రూ.10 వరకూ చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    గత డిసెంబరులో రాష్ట్రంలో మొత్తం 7,292.69 మి.యూ. విద్యుత్తు సరఫరా కాగా, అందులో 37.39% (2,726.40 మి.యూ.) విద్యుత్తును ఎక్స్ఛేంజీలో కొనుగోలు చేశారు. జనవరిలో 30.78% విద్యుత్తు కొనుగోలు జరిగింది.

    Details

    నివేదిక సమర్పించిన డిస్కంలు

    డిసెంబరులో రోజుకు సగటున 91.51 మి.యూ., జనవరిలో 83.59 మి.యూ. విద్యుత్తును డిస్కంలు కొన్నారు.

    ఫిబ్రవరిలో 1,000 మి.యూ., మార్చిలో 1,046 మి.యూ. విద్యుత్తును కొనుగోలు చేయాల్సి ఉంటుందని డిస్కంలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.

    రాష్ట్ర విద్యుత్తు సరఫరా కోసం డిస్కంలు దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకున్నాయి.

    అయితే వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో ఎక్స్ఛేంజీలో తాత్కాలికంగా తక్కువ రేట్లకు విద్యుత్తు లభిస్తున్నపుడు అక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు.

    ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య, సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య విద్యుత్తు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో, ఈ సమయాల్లో ఎక్స్ఛేంజీలో అధిక ధరలకు కూడా కొనాల్సిన పరిస్థితి ఉంది.

    Details

    డిస్కంలపై భారీ భారం

    ఒక్కో పావుగంట స్లాట్‌కు విద్యుత్తు ధర మారుతూ ఉంటుంది. డిమాండ్‌ అధికంగా ఉన్నపుడు యూనిట్‌ ధర గరిష్ఠంగా రూ.10కి చేరుతుండగా, లేని సమయంలో రూ.2 నుంచి రూ.3కే లభిస్తోంది.

    గత నెలలో మొత్తం 2,591 మి.యూ. విద్యుత్తును కొనుగోలు చేశారు. ఇందులో డిమాండ్‌ అధికంగా ఉన్న సమయంలో 1,190 మి.యూ. విద్యుత్తును అధిక ధరలకు కొనుగోలు చేయగా, మిగతా 1,401 మి.యూ. విద్యుత్తును తక్కువ ధరలు ఉన్న సమయంలో కొనుగోలు చేశారు.

    ఫలితంగా నెల మొత్తం సగటు కొనుగోలు ధర రూ.3.83గా నమోదైంది.

    రోజుకు కనీసం రూ.40 కోట్ల వరకు చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేయడం వల్లనే రాష్ట్రంలో నిరంతర సరఫరా కొనసాగుతోంది.

    Details

    రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక డిమాండ్‌ 

    శుక్రవారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్‌ 16,293 మెగావాట్లు నమోదైంది. ఈ నెలలో ఇది నాలుగోసారి అత్యధిక డిమాండ్‌ నమోదు కావడం గమనార్హం.

    గతేడాది మార్చి 8న 15,623 మెగావాట్లు డిమాండ్‌ నమోదై రికార్డు సృష్టించగా, ఈ నెల 5న 15,820 మెగావాట్లు నమోదై ఆ రికార్డును అధిగమించింది. అలాగే ఈ నెల 10, 19 తేదీల్లోనూ మరోసారి రికార్డు స్థాయిలో డిమాండ్‌ నమోదైంది.

    తాజాగా శుక్రవారం మళ్లీ 16,293 మెగావాట్లకు చేరింది. సాధారణంగా ఏటా మార్చిలోనే అత్యధిక విద్యుత్తు డిమాండ్‌ నమోదవుతుండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయికి చేరడం విశేషం.

    దీంతో డిస్కంలు అప్రమత్తమై విద్యుత్తు కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    విద్యుత్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    New Ration Card: ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల అఫ్లికేషన్లు భారతదేశం
    Electricity Department: వేసవికి విద్యుత్‌ శాఖ ముందస్తు సన్నాహాలు ఇండియా
    Bhu Bharati: వారసత్వ భూ బదిలీకి ఆన్లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ.. చట్టంలోని అంశాల ఆధారంగా ఐచ్ఛికాలు భారతదేశం
    Telangana Govt-CRISP: మంత్రి సీతక్కతో క్రిస్ప్ సెక్రటరీ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న క్రిస్ప్ భారతదేశం

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025