LOADING...
Rains: రాబోయే 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు
రాబోయే 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు

Rains: రాబోయే 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి బంగాళాఖాతంలో, ముఖ్యంగా ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని, రాయలసీమకు చేరువ ప్రాంతాల్లో ప్రస్తుతం వివిధ ఉపరితల ఆవర్తనాలు క్రియాశీలంగా ఉన్నాయి. ఈ వాతావరణ పరిమాణాల ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. బుధవారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు ఉధృతంగా కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో మిగిలిన జిల్లాల్లో స్వల్పంగా లేదా మోస్తరు స్థాయిలో వర్షాలు పడవచ్చని తెలిపారు.

వివరాలు 

ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు మరింత బలపడే అవకాశం 

ఇక మంగళవారం నాడు రాష్ట్రంలోని వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, కృష్ణా తదితర జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు మరింత బలపడే అవకాశమున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో అభివృద్ధి చెందే అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు నుండి కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ కేంద్రం తాజాగా అంచనా వేసింది.