NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్ 
    తదుపరి వార్తా కథనం
    కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్ 
    భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్

    కేరళలో హైఅలెర్ట్.. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు బంద్ 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 05, 2023
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన బీభత్సమైన వర్షానికి చెట్లు నేలరాలాయి. పలు నివాసాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

    ఇప్పటికే ఇడుక్కి, కాసరగోడ్, కన్నూర్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.

    మరోవైపు ఎడతెరిపిలేని వానల నేపథ్యంలో కేరళ సర్కార్ అప్రమత్తమైంది. ఎర్నాకులం, కన్నూర్, ఇడుక్కి, త్రిసూర్, కొట్టాయం, కాసర్ గోడ్ సహా ఆరు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలను ప్రారంభించింది.

    ఈ మేరకు ఆయా జిల్లాల విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించింది. మంగళవారం ఒక్కరోజే ఇడుక్కి జిల్లా పీర్మాడేలో రికార్డు స్థాయిలో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది.

    DETAILS

    హైరేంజ్ రోడ్లపై ప్రయాణాలు చేయవద్దు : కేరళ ముఖ్యమంత్రి విజయన్

    కేరళలో భారీ వర్షాలతో వరద ముప్పు పొంచి ఉన్న కారణంగా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.

    కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున హైరేంజ్ రోడ్లపై ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. బీచ్ లు , నదుల వద్దకు వెళ్లకూడదన్నారు.

    రాష్ట్ర వ్యాప్తంగా తాజా పరిస్థితులపై రెవెన్యూ శాఖ మంత్రి రాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు పలు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

    DETAILS

    కేరళ తీరప్రాంతాల్లో అల్లకల్లోలంగా మారిన సముద్రం

    కేరళ తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారి బలమైన గాలుల వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు.

    ప్రతికూల వాతావరణ పరిస్థితులలో చేపల వేటకు వెళ్లిన ఓ పడవ, సముద్రంలోనే బోల్తా పడింది.

    కొల్లాం, అలప్పుజా, త్రిసూర్, కొట్టాయం, ఎర్నాకులం సహా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగడంతో విద్యుత్ సరఫరా స్థంభించింది.

    మరోవైపు రోడ్లు, ఇళ్లు ధ్వంసం కాగా భారీ చెట్లు పడిపోయి కొల్లాం షెంకోట్టైలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్పందించిన రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి.

    పంబా నది వదద్ నీటిమట్టం పెరిగి పతనంతిట్ట జిల్లా కురుంబన్ ముజిలో వందలాది గిరిజనులు వరదలో చిక్కుకుపోయారు. మీనాచిల్ నది భారీ ప్రవాహంతో కొట్టాయం నివాసితులు ఆందోళన చెందుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    వర్షాకాలం
    ముఖ్యమంత్రి
    ప్రభుత్వం

    తాజా

    CM Chandrababu: కేబినెట్‌ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్
    Bangladesh: స్వాతంత్ర్య సమరయోధుల చట్టం సవరణ.. జాతిపితగా బంగ్లాదేశ్ ముజిబుర్ రెహమాన్‌ పేరు తొలగింపు  బంగ్లాదేశ్
    Rahul Gandhi: భారత సైన్యం పై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు! రాహుల్ గాంధీ
    Insurance: ధూమపానం అలవాటు ఉందా..? బీమా కంపెనీకి చెప్పకపోతే నష్టపోయేది ఎవరో తెలుసా?  జీవనశైలి

    కేరళ

    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్
    కేరళ జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ విడుదల, రెండేళ్లుగా జైలులోనే ఉత్తర్‌ప్రదేశ్
    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ ఇండియా

    వర్షాకాలం

    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ  ఆంధ్రప్రదేశ్
    ట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు  పర్యాటకం
    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  నైరుతి రుతుపవనాలు
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం నైరుతి రుతుపవనాలు

    ముఖ్యమంత్రి

    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్
     కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: 23మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసిన బీజేపీ  కర్ణాటక
    దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్‌ వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    125 అడుగుల ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    ప్రభుత్వం

    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం తెలంగాణ
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు ప్రధాన మంత్రి
    Telangana: మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు; విద్యార్థులకు బిర్యానీ, కిచిడి  తెలంగాణ
    మణిపూర్‌లో 5జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేత; ఇప్పటి వరకు 98మంది మృతి  మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025