NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
    తదుపరి వార్తా కథనం
    Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు
    ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు

    Murder: ఆంధ్రప్రదేశ్‌లో పరువు హత్య.. కుమార్తెను హత్య చేసిన తల్లిదండ్రులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 21, 2024
    09:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొడవలూరు మండలం పద్మనాభుని సత్రంలో జరిగిన దారుణ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

    తల్లిదండ్రులే తమ కుమార్తె శ్రావణిని హత్య చేసి, దాన్ని అదృశ్యంగా చూపించడానికి కుట్ర పన్నారు. తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

    రెండో కుమార్తె శ్రావణి (24)కు ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగినా, భర్తతో మనస్పర్థలు కారణంగా విడిపోయింది.

    తల్లిదండ్రుల వెంటనే ఉంటూ గ్రామంలో కూరగాయల వ్యాపారం చేసేది.

    Details

    కుమార్తెపై దాడి చేసి చంపిన తల్లిదండ్రులు

    ఈ క్రమంలో నార్తు ఆములూరు ప్రాంతానికి చెందిన రబ్బానీ బాషా అనే యువకుడితో పరిచయం ఏర్పడటంతో వారు 20 రోజుల క్రితం కసుమూరు దర్గాలో వివాహం చేసుకున్నారు.

    వివాహం విషయం తెలిసిన తల్లిదండ్రులు నార్త్ ఆములూరుకు వెళ్లి శ్రావణిని బలవంతంగా ఇంటికొచ్చారు.

    ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్రావణి తల్లిదండ్రుల చేతిలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది.

    తల్లిదండ్రులు మృతదేహాన్ని ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టి, తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    Details

    పోలీసుల అదుపులో తల్లిదండ్రులు

    అయితే గురువారం, డయల్ 100కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

    శ్రావణి మృతదేహాన్ని పూడ్చి పెట్టారనే సమాచారంతో అనుమానాస్పద ప్రదేశంలో తవ్వకాలు జరిపారు.

    అయితే శుక్రవారం శ్రావణి మృతదేహం బయటపడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    హత్య

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    High Alert for AP: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..   భారతదేశం
    Andhra Pradesh: ఏపీ వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్లు పంపిణీ.. ఏమేమీ ఉంటాయంటే చంద్రబాబు నాయుడు
    Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్  భారతదేశం
    AP floods: ఏపీలో భారీ వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య విడుదల భారతదేశం

    హత్య

    Chennai: ట్రయాంగిల్ లవ్.. ప్రేమను తిరస్కరించిన యువతిని సజీవ దహనం చేసిన ట్రాన్స్ జెండర్  చెన్నై
    Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు బెంగళూరు
    Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య  హైదరాబాద్
    Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025