NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MP: ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    MP: ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు
    ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు

    MP: ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 21, 2025
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మానవత్వాన్ని మరిచే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.

    ఓ వృద్ధుడిని ఆస్పత్రి సిబ్బంది అసభ్యంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండటంతో అధికార యంత్రాంగం స్పందించి కఠిన చర్యలు తీసుకుంది.

    ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, మరొకరిని తొలగించాలని సిఫార్సు చేసింది.

    Details

    ఏప్రిల్ 17న జ‌రిగిన ఘ‌ట‌న 

    నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (వయసు 77) తన భార్యకు వైద్య పరీక్షలు చేయించేందుకు ఛతర్‌పూర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు.

    అయితే అక్కడ ఓ దారుణం చోటుచేసుకుంది.

    ఆస్పత్రిలో టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని పెద్దగా క్యూలో నిలిచిన జోషి, తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా నిరాకరించడమే కాకుండా చెంపదెబ్బ కూడా కొట్టాడని జోషి ఆరోపించారు.

    సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ ప్రకారం, అప్పటికే ఆస్పత్రిలో భారీ రద్దీ ఉండటంతో క్యూలో నిలబడటం గురించి డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని తెలిపారు.

    Details

    అధికారులపై చర్యలు

    వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు అమానుషంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఈ ఘటనపై అధికారులు నోటీసులు జారీ చేశారు.

    ఈ ఘటనలో డాక్టర్ రాజేష్ మిశ్రాను వైద్య సేవల నుంచి తొలగించగా, సివిల్ సర్జన్ అహిర్వర్‌ను సస్పెండ్ చేశారు.

    ఆయనపై ఆరోపణలు ఏమిటంటే సిబ్బందిపై నియంత్రణ లేకపోవడం, కలెక్టర్ ఆదేశించిన నివేదికను సమర్పించకపోవడం, షోకాజ్ నోటీసుకు స్పందించకపోవడం వంటివి.

    ఇక రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన ఉద్యోగి రాజేంద్ర ఖరేను కూడా తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ పార్థ్ జైస్వాల్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

    Details

    క్రిమినల్ కేసు నమోదు

    ఇక ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ మిశ్రాపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 296, 3(5), మరియు 351(3) కింద 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

    అతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తర్వాత ఛతర్‌పూర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.

    ఈ అమానుష ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    వృద్ధుల పట్ల ఆస్పత్రుల్లో కనికరంగా ఉండాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రోగిపై వైద్యుల అమానుష ప్రవర్తన

    • 75 साल के बुजुर्ग को #छतरपुर जिला अस्पताल के डॉक्टर्स और अस्पताल स्टाफ द्वारा न सिर्फ लात-घूंसे मारे गए, बल्कि बेरहमी से घसीटकर अस्पताल से बाहर फेंक दिया गया!

    • पत्नी के इलाज के लिए आए बुजुर्ग का कसूर सिर्फ इतना था कि वे लंबी लाइन में लंबे वक्त तक खड़े नहीं हो पा रहे थे,… pic.twitter.com/VAB1MeMb1s

    — Jitendra (Jitu) Patwari (@jitupatwari) April 20, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఇండియా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    మధ్యప్రదేశ్

    MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు  భోపాల్
    Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి  రోడ్డు ప్రమాదం
    Gwalior: గ్వాలియర్‌లో ర్యాగింగ్ కలకలం.. మండే ఎండలో గంటల తరబడి మోకాళ్లపై కూర్చోపెట్టి ..  భారతదేశం
    Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో అభినవ దుశ్శాసన పర్వం భారతదేశం

    ఇండియా

     MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం హైదరాబాద్
    New Delhi: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో భారీ రద్దీ.. తృటిలో తప్పిన తొక్కిసలాట దిల్లీ
    Telangana: అసెంబ్లీలో మళ్లీ ప్రశ్నోత్తరాలు రద్దు.. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి! తెలంగాణ
    TTD: తితిదే బోర్డు కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం! తిరుమల తిరుపతి దేవస్థానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025