Page Loader
Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు 
మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు

Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 07, 2024
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఓ మహిళపై న్యూదిల్లీలో ఆమె స్నేహితుడు వారం రోజుల పాటు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలకు గురిచేసి తీవ్ర గాయాలపాలు చేశాడు. నిందితుడు మహిళపై "వేడి పప్పు" కూడా పోసేవాడని పోలీసులు మంగళవారం చెప్పారు. 28 ఏళ్ల నిందితుడు, పరాస్‌ను అరెస్టు చేసి, అత్యాచారం, సోడోమీ,హాని కలిగించినందుకు అతని పై అభియోగాలు మోపారు. మహిళ శరీరంపై దాదాపు 20 గాయాల గుర్తులు ఉన్నాయి. ఆమె ఆసుపత్రి పాలైంది. ఆమె ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు.

Details 

ఫోన్ కాల్ చేసిన వెంటనే మహిళను రక్షించిన పోలీసులు 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ పరాస్‌తో కలిసి దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో సుమారు నెల రోజులుగా నివసిస్తోంది. ఆ మహిళ గత 3-4 నెలలుగా పరాస్‌తో స్నేహాన్ని పెంచుకుంది. జనవరి 30న, నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ కాల్ చేసి తన స్నేహితుడు తనపై దాడి చేశాడని తెలిపింది. ఈ విషయమై వేగంగా స్పందించిన పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించి, వైద్య సహాయం కోసం వెంటనే ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2న అరెస్టు చేశారు.

Details 

బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు 

మహిళ వాంగ్మూలం ప్రకారం, ఆమె జనవరి ప్రారంభంలో ఓ ఇంట్లో పని మనిషిగా ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లడానికి సిద్ధమైంది. అంతకంటేముందు, ఆ ఉద్యోగాన్ని ఇప్పించడంలో సహాయం అందించిన పరాస్‌ను కలవడానికి ఆమె ఢిల్లీకి వెళ్లడంతో అతను ఆమెను ఢిల్లీలోనే ఉండమని కోరినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది. అనంతరం,పరాస్ ఆమెను ఒక వారం పాటు శారీరక వేధింపులకు,లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఆమెపై వేడి పప్పు పోయటంతో,ఆమెకు గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై, భారతీయ శిక్షాస్మృతిలోని 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 376 (అత్యాచారం) 377 (సోడమీ) సెక్షన్ల కింద జనవరి 30న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు .దీనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.