NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 
    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 
    భారతదేశం

    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 14, 2023 | 12:26 pm 1 నిమి చదవండి
    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? 
    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా?

    ఝాన్సీ జిల్లాలో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కొడుకు అసద్‌ మరణించారు. అయితే 'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పోలీసులకు అసద్ ఎలా కార్నర్ అయ్యాడు. పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా? తెలుసుకుందాం. గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నాయకుడైన అతిక్ అహ్మద్‌ను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గురువారం కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో అతిక్ అహ్మద్‌ను తప్పించుకోవడానికి అతను ప్రయాణిస్తున్న పోలీసు కాన్వాయ్‌పై దాడి చేయడానికి అసద్, అతని సహాయకుడు గులాం ప్లాన్ చేస్తున్నారనే తమకు అందినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

    ఉమేష్ పాల్ హత్య కేసు నిందితుల్లో మొత్తం నలుగురు మృతి 

    తన తండ్రిని విడిపించడానికి అసద్ చేసిన ప్లాన్ భగ్నం చేయడానికి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సివిల్ పోలీసులు, ప్రత్యేక బలగాల బృందాలను మోహరించినట్లు యూపీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అసద్‌ను పట్టుకోవడానికి రెండు బృందాలను మోహరించినట్లు చెప్పారు. అసద్ తన సహచరుడు గులామ్‌తో కలిసి బైక్‌పై వెళుతుండగా అతన్ని అడ్డగించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అసద్, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్‌ను మొత్తం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. అసద్, గులామ్ మరణంతో ఉమేష్ పాల్ హత్య కేసుతో సంబంధం ఉన్న మొత్తం నలుగురులో పోలీసులు కాల్పుల్లో మరణించినట్లు అయ్యింది.

    ఏప్రిల్ 12న అతిక్ అనుచరుడు గుడ్డు ముస్లిం కదలికలను పసిగట్టిన పోలీసులు 

    అతిక్ అనుచరుడు, ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన గుడ్డు ముస్లిం ఝాన్సీ హైకి సమీపంలోని అడవిలోని రహస్య ప్రదేశంలో ఉన్నట్లు ఎస్‌టీఎఫ్ తెలుసుకుంది. అంతేకాదు ఝాన్సీలోని పరిణామాలను ట్రాక్ చేస్తోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి గుడ్డు ముస్లిం స్థావరం కిలోమీటరు దూరంలో ఉండటం గమనార్హం. అతిక్‌ను ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లనున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బృందం గుడ్డు ముస్లిం స్థావరంపై కన్నేసి ఉంచినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 12న, గుడ్డు ముస్లిం కార్యకలాపాలు కనిపించాయని, అందుకే తాము అప్రమత్తమై, హైవై నాలుగు బృందాలను మోహరించినట్లు చెప్పారు. తాము అనుకున్నట్లుగానే అసద్ ఎదురుపడం, ఎదురు కాల్పుల్లో అతను చనిపోవడం జరిగిందన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఉత్తర్‌ప్రదేశ్

    దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం  వైరల్ వీడియో
    గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌  తాజా వార్తలు
    ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం తాజా వార్తలు
    ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం తాజా వార్తలు

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    అమెరికాలో దారుణం: టెక్సాస్‌ ఫామ్‌లో భారీ పేలుడు; 18,000పైగా ఆవులు మృతి  అమెరికా
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్
    Ambedkar Jayanti 2023: దేశంలోనే డాక్టరేట్‌ అభ్యసించిన మొదటి వ్యక్తి అంబేద్కర్  అంబేద్కర్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి పంజాబ్
    దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!  కరోనా కొత్త కేసులు
    భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?  పంజాబ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023