NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది? 
    తదుపరి వార్తా కథనం
    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది? 
    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?

    ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది? 

    వ్రాసిన వారు Stalin
    Oct 09, 2023
    06:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాలస్తీనాకు చెందిన హమాస్‌ గ్రూప్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది.

    ఉద్రిక్తతల నేపత్యంలో లక్షల మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు.

    ఇజ్రాయెల్‌లో భారతీయులు సురక్షితంగా ఉన్నారా? వారు ఎక్కడ తలదాచుకుంటున్నారు? కేంద్రం ప్రభుత్వం ఏం చెబుతోంది.?

    హమాస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిని ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు.

    ఇజ్రాయెల్‌లో సుమారు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు.

    ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో వృద్ధులను సంరక్షకులుగా పనిచేస్తున్నారు.

    సుమారు వెయ్యి మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు ఉంటారు.

    వజ్రాల వ్యాపారులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 85,000మంది భారతీయ సంతతికి చెందిన యూదులు నివసిస్తున్నారని ఎన్డీటీవీ నివేదిక చెబుతోంది.

    హమాస్

    1950లో ప్రారంభమైన ఇజ్రాయెల్‌కు వలసలు

    ఇజ్రాయెల్‌కు భారతీయుల వలసలు 1950, 1960లలో ప్రారంభమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. మిజోరాం, మణిపూర్‌లోని యూదులు భారీ సంఖ్యలో ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు.

    ఇజ్రాయెల్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న తీరప్రాంత నగరమైన అష్కెలోన్‌లో శనివారం జరిగిన క్షిపణి దాడిలో కేరళకు చెందిన షీజా ఆనంద్ అనే మహిళ గాయపడ్డారు.

    హిబ్రూ యూనివర్శిటీలో డాక్టరేట్ చదవుతున్న బిందు మాట్లాడుతూ.. భారతీయులందరూ పరస్పరం టచ్‌లో ఉన్నారని చెప్పారు.

    హిమాస్ మిలిటెంట్ల దాడి నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారినట్లు మరో విద్యార్థి వికాస్ శర్మ పేర్కొన్నారు.

    చాలా మంది విద్యార్థులు విద్యాసంస్థలు అందించిన వసతి గృహాల్లో ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు.

    వాట్సాప్ ద్వారా భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

    భారత్

    వీధుల్లో బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న హమాస్ మిలిటెంట్లు

    అత్యంత సున్నిత ప్రాంతమైన అష్కెలోన్‌లో నివసిస్తున్న ఎల్లే ప్రసాద్ మాట్లాడుతూ.. పరిస్థితులు భయకరంగా ఉందన్నారు.

    తాము ప్రత్యేక్షంగా క్షిపణి దాడులను చూస్తున్నట్లు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కేరళకు చెందిన జిబి యోహన్నన్ పేర్కొన్నారు.

    హిమాస్ మిలిటెంట్లు వాహనాల్లో వచ్చి వీధుల్లోని పౌరులపై బుల్లెట్ల వర్షం కురపిస్తున్నారని యోహన్నన్ తెలిపారు.

    టెల్ అవీవ్‌లోని భారతీయులు తిరిగి స్వదేశానికి రావడానికి ఇండియన్ ఎంబసీ అభ్యర్థనలను స్వీకరించింది.

    ఇదే సమయంలో కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని వీలైనంత త్వరగా భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

    భారత్

    భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు: విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి 

    24 గంటలూ భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటామని వారికి మార్గనిర్దేశం చేస్తున్నామని ఇండియన ఎంబసీ వర్గాలు చెబుతున్నాయి.

    భారతీయ పౌరులను ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని ఇజ్రాయెల్‌, పాలస్తీనాలోని రాయబార కార్యాలయాలు వెల్లడించాయి.

    ఇదిలా ఉంటే, భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు.

    రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో, కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో భారత్ తన పౌరులను విదేశాల నుంచి విజయవంతంగా తరలించిందని ఆమె తెలిపారు.

    ఇప్పటికే ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చాను సురక్షితంగా ఇండియాకు తరలించిన విషయం తెలిసిందే.

    సెప్టెంబర్ 28నుంచి అక్టోబర్ 7వరకు జరిగిన హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఆమె ఇజ్రాయెల్ వెళ్లారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    హమాస్
    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఇజ్రాయెల్

    పాలస్తీనాపై ఇజ్రాయెల్ దళాల దాడి; 11మంది మృతి పాలస్తీనా
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు కోవిడ్
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ న్యాయ శాఖ మంత్రి
    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు లెబనాన్

    హమాస్

    ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం.. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు  ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి.. అమెరికా-ఇరాన్ 6 బిలియన్ డాలర్ల ఒప్పందానికి లింకేంటి? అమెరికా
    ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి వెనుక ఇరాన్‌ హస్తం  ఇజ్రాయెల్

    ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    Israel-Hamas conflict: నెత్తురోడుతున్న పశ్చిమాసియా.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 1,100 మంది మృతి  అంతర్జాతీయం
    Israel-Hamas conflict: హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు    భారతదేశం
    Gaza : గాజా దిగ్భంధనం.. నీరు, విద్యుత్తు, ఆహారం నిలిపివేసి మృగాలతో పోరాడుతున్నాం : ఇజ్రాయెల్‌  ఇజ్రాయెల్

    తాజా వార్తలు

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు  చంద్రబాబు నాయుడు
    Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు  దిల్లీ
    మెటా కొత్త ప్లాన్: ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో యాడ్స్ ఉండవు  మెటా
    బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్ బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025