NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి?
    తదుపరి వార్తా కథనం
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి?
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి?

    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి?

    వ్రాసిన వారు Stalin
    May 30, 2023
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న వేళ, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రత్యేక రూ.75 నాణెం విడుదల చేశారు.

    అయితే భారతదేశంలో ఇలాంటి స్మారక నాణేలను విడుదల చేయడం ఇది మొదటిసారేమీ కాదు.

    ప్రముఖులకు నివాళులర్పించడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం లేదా కీలకమైన చారిత్రాత్మక సంఘటనలను గుర్తుచేసుకోవడం వంటి అనేక కారణాల వల్ల 1964 నుంచి దాదాపు 150 పైగా నాణేలను విడుదల చేశారు.

    జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని తొలి నాణేన్ని విడుదల చేశారు.

    భారత్

    రూ.75 నాణెం ప్రత్యేకతలు ఇవే

    రూ.75నాణెం 44మిమీ వ్యాసంతో వృత్తాకారంగా ఉంటుంది. దాని బరువు 35గ్రాములు. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5శాతం జింక్‌ మిశ్రమంతో దీన్ని తయారు చేశారు.

    నాణేనికి ముఖం మధ్యలో 'అశోక స్థంభం' ఉంటుంది. దాని కింద 'సత్యమేవ జయతే' అని రాసి ఉంటుంది.

    అశోక స్తంభానికి ఎడమ అంచున దేవనాగరి లిపిలో 'భారత్' అని, కుడి అంచున 'ఇండియా' అని ఆంగ్లంలో రాసి ఉంటుంది.

    రూ.75 నాణెం రెండో వైపు కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం ఉంటుంది.

    పార్లమెంట్ కాంప్లెక్స్ చిత్రం క్రింద '2023' అని ఉంటుంది.

    నాణేల చట్టం, 2011 ప్రకారం, వివిధ విలువలతో కూడిన నాణేల రూపకల్పన, ముద్రించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

    దిల్లీ

    రూ.75నాణేన్ని ఆన్‌లైన్‌లో ఇలా కొనుక్కోవాలి

    రూ.75 నాణేన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ప్రభుత్వ వెబ్‌సైట్: Indiagovmint.inకు వెళ్లాలి. ఈ సైట్ ద్వారా స్మారక నాణేలను విక్రయిస్తారు.

    ఈ నాణేలు చెలామణి కోసం ఉద్దేశించినవి కావు. వీటి ద్వారా లావాదేవీల చేయడం కుదరదు.

    స్మారక నాణేలు సాధారణంగా గొప్ప విలువను కలిగి ఉండే సేకరణలు.

    స్మారక నాణేలకు ప్రభుత్వం ఒక ధరను నిర్ణయిస్తుంది. అయితే రూ.75 నాణెం ధరను ఇప్పటివరకు నిర్ణయించలేదు.

    ధరను నిర్ణయించి ఆన్ లైన్‌లో పెట్టిన తర్వాతే దాన్ని కొనుగోలు చేయడానికి వీలుపడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ
    ప్రధాన మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    నరేంద్ర మోదీ

    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు కర్ణాటక
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే

    దిల్లీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: ఛార్జిషీట్‌లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును చేర్చిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్‌ కన్నీటి పర్యంతం  రెజ్లింగ్
    దిల్లీలో దట్టమైన పొగమంచు; 13 ఏళ్లలో కనిష్టానికి చేరిన మే నెల ఉష్ణోగ్రతలు  ఐఎండీ

    ప్రధాన మంత్రి

    'నా కూతురు తన భర్తను ప్రధానిని చేసింది': రిషి సునక్‌పై సుధా మూర్తి ఆసక్తికర కామెంట్స్ బ్రిటన్
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ నన్ను 91సార్లు దుర్భాషలాడింది: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫైర్ కర్ణాటక
    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం మన్ కీ బాత్

    తాజా వార్తలు

    అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సందేశం; అది ఏలియన్ సిగ్నలేనా? భూమి
    ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్ ఎలాన్ మస్క్
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025