NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhu Bharathi: తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు - నిషేధిత భూముల సమాచారం తెలుసుకోవడమెలా?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Bhu Bharathi: తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు - నిషేధిత భూముల సమాచారం తెలుసుకోవడమెలా?

    Bhu Bharathi: తెలంగాణ భూ భారతి పోర్టల్ సేవలు - నిషేధిత భూముల సమాచారం తెలుసుకోవడమెలా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    12:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో తాజాగా అమలులోకి వచ్చిన "భూ భారతి చట్టం" ప్రస్తుతం నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో అమలవుతోంది.

    త్వరలోనే ఇది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. ఈ కొత్త చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ శాఖ అధికారులు మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

    ఈ సదస్సుల ద్వారా కొత్త చట్టం ఉపయోగాలపై వివరణ ఇస్తున్నారు. ఈ చట్టం అమలుతో భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల వంటి అంశాలు ఇప్పుడు భూ భారతి పోర్టల్ ద్వారా నిర్వహించబడతాయి.

    గతంలో అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020 రద్దయ్యిన తర్వాత భూముల సంబంధిత అన్ని సేవలు ఇప్పుడు భూ భారతి చట్టంపై ఆధారపడి ఉంటాయి.

    రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వంటి ప్రక్రియల్లో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులను కూడా ప్రవేశపెట్టింది.

    వివరాలు 

    ఈ చట్టంలో ముఖ్యమైన సెక్షన్లు 

    రైతులకు సహాయంగా ఉండేలా ఈ చట్టంలో ముఖ్యమైన సెక్షన్లను చేర్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

    పట్టా భూముల యజమానుల హక్కులను పరిరక్షించడమే కాకుండా, ప్రభుత్వ భూములను సురక్షితంగా ఉంచేందుకు ఈ చట్టం లో భద్రతాత్మక నిబంధనలను అమలు చేసింది.

    పోర్టల్‌లో లావాదేవీలు నిర్వహించడానికే కాక, సమాచార సేవలు కూడా విడదీసి అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా నిషేధిత భూముల జాబితా కూడా ఇందులో పొందుపరిచారు.

    వివరాలు 

    నిషేధిత భూముల వివరాలు తెలుసుకోవడం ఎలా? 

    ముందుగా భూ భారతి అధికారిక వెబ్‌సైట్ లోకి ప్రవేశించాలి.

    హోం పేజీలో కనిపించే "సమాచార సేవలు" విభాగాన్ని ఎంచుకోవాలి.

    అందులో "నిషేధిత భూములు" అనే ఎంపికపై క్లిక్ చేయాలి.

    తదుపరి పేజీలో జిల్లా, మండలం, గ్రామ పేర్లను నమోదు చేసి, సూచించిన కోడ్‌ను ఎంటర్ చేయాలి.

    తరువాత "సబ్మిట్" క్లిక్ చేస్తే, ఎంపిక చేసిన గ్రామానికి చెందిన నిషేధిత భూముల జాబితా చూపించబడుతుంది.

    ఈ జాబితాలో ఉన్న భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేదా లావాదేవీలు జరపలేరు.

    వివరాలు 

     జాబితాలో ప్రైవేట్ పట్టా భూములు

    పూర్వంలో ధరణి పోర్టల్‌లో కూడా నిషేధిత భూముల వివరాలను ప్రత్యేక కాలమ్‌లో పొందుపరిచారు.

    అయితే, కొన్ని ప్రైవేట్ పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

    అటువంటి భూములను పరిశీలించి తొలగించడానికి కలెక్టర్లకు అధికారాలు ఉన్నా, ఆ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి.

    ప్రస్తుత భూ భారతి చట్టం ప్రకారం, భూమికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పిస్తే... ఆ సమాచారాన్ని పరిశీలించి, ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం కలెక్టర్‌కు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

    ఇంకా రాష్ట్రంలో భూ హక్కులు ఏ పద్ధతిలో మారినా, అవి మ్యుటేషన్ ద్వారా నమోదు చేయబడతాయి.

    వివరాలు 

    భూ సమస్యలు ఎదురైనప్పుడు.. రెండు స్థాయిల అప్పీల్ వ్యవస్థ

    కొత్తగా ఇచ్చే పాసుపుస్తకాల్లో సర్వే మ్యాప్ సహా వివరాలు ఉంటాయి. భూ సమస్యలు ఎదురైనప్పుడు, వాటిని పరిష్కరించేందుకు రెండు స్థాయిల అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

    భూ హక్కుల రికార్డుల్లో సమస్యలు ఉంటే... మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో), రీజినల్ డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో), జిల్లా కలెక్టర్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చు.

    గత ధరణి వ్యవస్థలో ఇటువంటి అప్పీల్ వ్యవస్థ లేదు. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా అవకాశం కల్పించింది.

    అలాగే అక్రమంగా పొందిన ప్రభుత్వ భూములపై ఉన్న పట్టాలను రద్దు చేసే అధికారాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    తెలంగాణ

    Young India Police School: సైనిక పాఠశాలల తరహాలో యంగ్‌ ఇండియా పోలీస్ స్కూల్‌ ప్రారంభం.. ఈ స్కూల్లో ఎలా చేరాలంటే.. భారతదేశం
    Telangana: కంచ గచ్చిబౌలి భూ వివాదం.. హెచ్‌సీయూకు కేంద్ర సాధికారిక కమిటీ విచారణ ఇండియా
    Telangana: జూన్‌ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు.. పౌరసరఫరాల సంస్థ నిర్ణయం భారతదేశం
    Telangana: బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్‌ విద్యాశాఖ శ్రీకారం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025