NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lucknow: లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Lucknow: లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు
    లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు

    Lucknow: లక్నో ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 200 మందికి పైగా రోగులు తరలింపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 15, 2025
    09:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని లోక్‌బంధు ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

    పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో పైఅంతస్తుల వరకు పొగ వ్యాపించింది.

    ఈ ఘటనతో రోగులు, వారి కుటుంబసభ్యులు భయభ్రాంతులకు లోనయ్యారు.

    వెంటనే స్పందించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

    రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక వాహనాలు పని చేస్తున్నాయి.

    దట్టమైన పొగ కారణంగా రోగులు, సహాయకులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అపాయాన్ని నివారించేందుకు ఆసుపత్రి భవనాన్ని పూర్తిగా ఖాళీ చేశారు.

    వివరాలు 

    ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష

    ప్రస్తుతం వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల గురించి అధికారిక సమాచారం లేదు.

    అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. పోలీసులు, సంబంధిత అధికార యంత్రాంగం ఘటనాస్థలంలోనే ఉన్నాయి.

    ఆసుపత్రి పరిసరాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు.

    అధికారుల నుంచి ఫోన్ ద్వారా పూర్తి సమాచారం పొందారు. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు.

    వివరాలు 

    ప్రస్తుతం ఆందోళన అవసరం లేదు: డిప్యూటీ సీఎం

    ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.

    మూడవ అంతస్తులో తొలుత పొగ కనిపించిందని, వెంటనే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది రోగులను తరలించడం ప్రారంభించారని తెలిపారు.

    దాదాపు 200 మంది రోగులను సురక్షితంగా తరలించి ఇతర ఆసుపత్రుల్లో చేర్చారు.

    ప్రస్తుతం ఆందోళనకు అవసరం లేదని డిప్యూటీ సీఎం తెలిపారు.

    భవనం లోపల మంటలను అగ్నిమాపక సిబ్బంది కట్టడి చేయడానికి కృషి కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఉత్తర్‌ప్రదేశ్

    Kumbha Mela: వీఐపీ సంస్కృతి వల్లే.. మహా కుంభ తొక్కిసలాట ఘటనపై విపక్షాలు  భారతదేశం
    Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే! భారతదేశం
    Maha Kumbh Mela Special Trains : కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు రైల్వే బోర్డు
    Kumbh Mela Stampede: తొక్కిసలాట తర్వాత కుంభమేళాలో మార్పులు.. ఫిబ్రవరి 4 వరకు వాహనాలకు నో ఎంట్రీ, VVIP పాస్‌లు రద్దు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025