Page Loader
రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 24, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాటయ్యేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. జులై 25 నాటికి ఏపీలోని ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని, మరో 24 గంటల్లోనే (జులై 26 వరకు) వాయుగుండంగా బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 24 నుంచి 28 వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తాజాగా వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంట ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

DETAILS

ఈ నెల 24 నుంచి 28 వరకు అతిభారీ వర్షాలు : ఐఎండీ

ఏపీలోని కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 5 రోజుల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో ఈ నెల 24 నుంచి 26 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. జులై 25న మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఇక తెలంగాణలోనూ జులై 25 నుంచి 28 వరకు అత్యంత భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పింది. ఏటా జులై నుంచి నవంబరు వరకు తుపానులకు అనుకూల సీజన్ గా భావిస్తారు. ఇందులో భాగంగానే మొదట నైరుతి రుతుపవనాలు, అనంతరం ఈశాన్య రుతుపవనాలు తుపానులకు బలాన్ని సమకూర్చుతాయి.