Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్
హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం చార్మినార్ ఎక్స్ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. రైలు చెన్నై నుంచి నాంపల్లి వస్తున్న వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాంపల్లి రైల్వే స్టేషన్(Nampally railway station)లో రైలు ప్లాట్ఫారమ్పైకి రాగానే.. అది ట్రాక్ తప్పి.. సైడ్ వాల్ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు పట్టాలు తప్పడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనతో పలు రైలు సర్వీసులపై ప్రభావం పడింది. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.