
Seema Haider: 'నేను భారత్కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్ విజ్ఞప్తి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు.
తాను పాకిస్తాన్ కూతురైనప్పటికీ, ఇప్పుడు భారత్కు కోడలినని పేర్కొంటూ భారత్లో ఉండనివ్వాలని కోరారు. ఈ మేరకు సీమా హైదర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కఠిన చర్యలు చేపట్టింది.
సార్క్ వీసాలను రద్దు చేస్తూ, ఇప్పటికే భారత్కు వచ్చిన పాకిస్తాన్ పౌరులను వారంలోగా దేశం విడిచిపెళ్లాలని ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య సీమా హైదర్ను పాక్కు పంపాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
Details
నేను పాకిస్థాన్ కు వెళ్లాలనుకోవడం లేదు
వైరల్ అవుతున్న వీడియోలో సీమా హైదర్ మాట్లాడుతూ, నేను పాకిస్తాన్కు తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. ఇప్పుడు భారత్లో ఆశ్రయం పొందుతున్నాను.
మోదీ జీ, యోగి జీ, దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నేను పాకిస్తాన్ కూతురిని కానీ ఇప్పుడు భారత్ కోడలిని అని అభ్యర్థించింది.
సచిన్ మీనాతో వివాహం అనంతరం తాను హిందూ మతాన్ని స్వీకరించినట్లు కూడా సీమా తెలిపింది. గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో పబ్జీ గేమ్ ద్వారా సీమా పరిచయం అయ్యింది.
అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా, సీమా తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మార్గంగా భారత్కు చేరుకుంది.
Details
నోయిడాలో నివాసముంటున్న సీమా హైదర్
ప్రస్తుతం సచిన్తో కలిసి నోయిడాలో నివసిస్తోంది. ఇటీవల ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించింది.
దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ ఆమెకు భారత్లోనే ఉండేందుకు అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీమా ఇకపై పాకిస్తాన్ పౌరురాలు కాదని, ఆమె భారత భర్తతో తన పౌరసత్వం ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం దాడిపై సీమా తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు కూడా తెలిపారు.