NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!
    'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!

    Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 26, 2025
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు.

    తాను పాకిస్తాన్ కూతురైనప్పటికీ, ఇప్పుడు భారత్‌కు కోడలినని పేర్కొంటూ భారత్‌లో ఉండనివ్వాలని కోరారు. ఈ మేరకు సీమా హైదర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఇటీవల పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై కఠిన చర్యలు చేపట్టింది.

    సార్క్ వీసాలను రద్దు చేస్తూ, ఇప్పటికే భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ పౌరులను వారంలోగా దేశం విడిచిపెళ్లాలని ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య సీమా హైదర్‌ను పాక్‌కు పంపాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.

    Details

    నేను పాకిస్థాన్ కు వెళ్లాలనుకోవడం లేదు

    వైరల్ అవుతున్న వీడియోలో సీమా హైదర్ మాట్లాడుతూ, నేను పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. ఇప్పుడు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నాను.

    మోదీ జీ, యోగి జీ, దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నేను పాకిస్తాన్ కూతురిని కానీ ఇప్పుడు భారత్ కోడలిని అని అభ్యర్థించింది.

    సచిన్ మీనాతో వివాహం అనంతరం తాను హిందూ మతాన్ని స్వీకరించినట్లు కూడా సీమా తెలిపింది. గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాతో పబ్‌జీ గేమ్‌ ద్వారా సీమా పరిచయం అయ్యింది.

    అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా, సీమా తన నలుగురు పిల్లలతో కలిసి నేపాల్ మార్గంగా భారత్‌కు చేరుకుంది.

    Details

    నోయిడాలో నివాసముంటున్న సీమా హైదర్

    ప్రస్తుతం సచిన్‌తో కలిసి నోయిడాలో నివసిస్తోంది. ఇటీవల ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించింది.

    దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా, సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ ఆమెకు భారత్‌లోనే ఉండేందుకు అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    సీమా ఇకపై పాకిస్తాన్ పౌరురాలు కాదని, ఆమె భారత భర్తతో తన పౌరసత్వం ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు.

    పహల్గాం దాడిపై సీమా తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు కూడా తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    నరేంద్ర మోదీ

    Amaravati: ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం  అమరావతి
    PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్‌.. లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ పాడ్‌కాస్ట్‌ నేడే విడుదల!  ఇండియా
    PM Modi: జాతి ప్రయోజనాలే సర్వోన్నతం.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌ ముఖాముఖిలో ప్రధాని మోదీ భారతదేశం
    PM Modi: దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025