Page Loader
Pooja Khedkar: 'నేను మళ్ళీ త్వరలో వస్తా'.. శిక్షణ నుండి తొలగించడంపై స్పందించిన పూజా ఖేద్కర్ 
శిక్షణ నుండి తొలగించడంపై స్పందించిన పూజా ఖేద్కర్

Pooja Khedkar: 'నేను మళ్ళీ త్వరలో వస్తా'.. శిక్షణ నుండి తొలగించడంపై స్పందించిన పూజా ఖేద్కర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2024
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ నుండి వచ్చిన లేఖను అనుసరించి ట్రైనీ IAS అధికారి పూజా ఖేద్కర్ శిక్షణను వాషిమ్‌లో నిలిపివేశారు. దీని తర్వాత ఆమె వాషిమ్ నుండి తన ఇంటికి బయలుదేరింది. దాని గురించి ఆమెను అడిగితే, 'నేను త్వరలో మళ్లీ వశీమ్‌కి వస్తాను' అని చెప్పింది. శిక్షణ కోసం ఖేద్కర్‌ను జూలై 11న వాషిం జిల్లాకు పంపిన విషయం తెలిసిందే. వీరి శిక్షణ కాలం మార్చి 31 వరకు ఉంది. మొదటి రెండు రోజులు వాషిమ్‌లో పనిచేసిన తరువాత, ఆమెని జూలై 15 నుండి 19 వరకు అకోలాలోని గిరిజన విభాగానికి పంపాలని నిర్ణయించారు.

వివరాలు 

OBC సంస్థలు  ఖేద్కర్‌కి మద్దతు

సోమవారం అర్థరాత్రి మహిళా పోలీసుల బృందం ఖేద్కర్ ఉంటున్న విశ్రాంతి గృహానికి చేరుకుంది. మూడు గంటల పాటు బృందం అక్కడే ఉండిపోయింది. పోలీసులకి ఫోన్ చేసింది తానేనని ఖేద్కర్ చెబుతున్నారు. ఈ సమయంలో, శంభాజీ బ్రిగేడ్ కార్మికులు ఖేద్కర్‌పైకి వచ్చారు. అదే సమయంలో, OBC సంస్థలు ఆమెకి మద్దతు ఇస్తున్నాయి. వీటన్నింటి మధ్య, వాషిమ్‌లో ఆమె శిక్షణ నిలిపేసారు. ఆమె ముస్సోరీలోని శిక్షణా కేంద్రానికి పిలిచారు.

వివరాలు 

పూజా ఖేద్కర్‌ను ముస్సోరీకి ఎందుకు పిలిచారు? 

కంటి చూపు లోపం, మానసిక అనారోగ్యం కారణంగా నకిలీ అంగవైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించి ఐఏఎస్ అయ్యిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేద్కర్‌కు పెద్ద షాక్ తగిలింది. వీరి శిక్షణకు స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ మహారాష్ట్రలో జరుగుతున్న శిక్షణను విడిచిపెట్టి జూలై 23 లోపు ముస్సోరీకి హాజరు కావాలని ఆదేశించింది.

వివరాలు 

పూజా ఖేద్కర్‌పై చర్యలు  

ఫేక్ ఐడెంటిటీని ఉపయోగించి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైనందుకు పూజా ఖేద్కర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఆమెపై యుపిఎస్‌సి శుక్రవారం అనేక చర్యలను ప్రారంభించింది. దుష్ప్రవర్తన ఆరోపణలపై 'సమగ్ర విచారణ' తర్వాత కమిషన్ ఖేద్కర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022 కోసం ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ, భవిష్యత్ పరీక్షలకు హాజరుకాకుండా నిషేధిస్తూ కమిషన్ ఆమెకి షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. ఖేద్కర్‌పై కమిషన్‌ గురువారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూపీఎస్సీ నుంచి ఫిర్యాదు అందిందని, ఆ తర్వాత ఖేద్కర్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం క్రైమ్‌ బ్రాంచ్‌ కేసు దర్యాప్తు చేస్తోందని పోలీసులు తెలిపారు.

వివరాలు 

పూజా తండ్రి అరెస్టుపై స్టే 

పూజా తండ్రి దిలీప్ ఖేద్కర్‌కు జులై 25వరకు అరెస్ట్ చేయకుండా పూణేలోని సెషన్స్ కోర్టుమధ్యంతర రక్షణ కల్పించింది. భూవివాదానికి సంబంధించి ఓవ్యక్తిని పిస్టల్‌తో బెదిరించిన కేసులో ఈరక్షణ కల్పించారు. ఇదే కేసులో ఆయన భార్య,పూజ తల్లి మనోరమను పూణె రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మనోరమను జూలై 20 వరకు పోలీసు కస్టడీకి పంపారు. దిలీప్ ఖేద్కర్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తదుపరి విచారణ తేదీ అయిన జూలై 25వరకు అరెస్టు చేయకుండా న్యాయమూర్తి ఏఎన్ మారే తనకు మధ్యంతర రక్షణ కల్పించారని అతని తరపు న్యాయవాది తెలిపారు. దిలీప్,మనోరమలతో పాటు మరో ఐదుగురిపై పౌర్ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్లు,ఆయుధ చట్టం కింద కేసు నమోదైంది.