NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / High Speed Trains: 280 kmph వేగంతో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్న ICF : రైల్వే మంత్రి
    తదుపరి వార్తా కథనం
    High Speed Trains: 280 kmph వేగంతో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్న ICF : రైల్వే మంత్రి
    280 kmph వేగంతో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్న ICF : రైల్వే మంత్రి

    High Speed Trains: 280 kmph వేగంతో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తున్న ICF : రైల్వే మంత్రి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    చెన్నైలోని సమీకృత రైలుపెట్టెల తయారీ కర్మాగారంలో గంటకు 280 కి.మీ.వేగంతో నడిచే హైస్పీడ్ రైళ్లను రూపొందిస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

    ఒక్కో రైల్వే పెట్టె తయారీకి సుమారు రూ.28 కోట్ల ఖర్చు వస్తుందని వివరించారు. బుధవారం లోక్‌సభలో మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

    వందేభారత్ రైళ్ల విజయంతో,ఇప్పుడు హైస్పీడ్ రైళ్ల రూపకల్పన,తయారీపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది.

    ఈ రైళ్లకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ మెరుగైన ఛైర్‌కార్‌లు,గాలి చొరబడని నిర్మాణం, అత్యుత్తమ ఏసీ సదుపాయాలు,మరింత ప్రకాశవంతమైన వాతావరణం ఉంటాయి.

    ప్రయాణికుల సౌకర్యార్థం ఆటోమేటిక్ తలుపులు,ఉష్ణోగ్రత నియంత్రణ,సీసీటీవీ కెమెరాలు,మొబైల్ ఛార్జింగ్,అగ్నిమాపక పరికరాలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

    వివరాలు 

    తగ్గిన రైలు ప్రమాదాలు 

    రైళ్ల నమూనాలు ఖరారైన తర్వాత వాటి అందుబాటుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.

    అలాగే, ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తున్నదని, సముద్ర గర్భంలో 21 కి.మీ. సొరంగ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించారు.

    2014-15లో 135 రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, 2023-24లో ఆ సంఖ్య 40కి తగ్గిందని మంత్రి వెల్లడించారు.

    రైలు ప్రయాణికుల బీమా పథకంలో, 2019 నవంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు పరిహారానికి ఎలాంటి అభ్యర్థనలు రాలేదని తెలిపారు.

    అదే కాలంలో రైలు ప్రమాదాల కారణంగా రూ.313 కోట్ల నష్టం జరిగిందని వివరించారు.

    వివరాలు 

    ప్రయాణికుల కోసం మెరుగైన సదుపాయాలు 

    ఏసీ ప్రయాణికుల కోసం ఇచ్చే ఉన్ని రగ్గులను నెలకొకసారి శుభ్రపరుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

    రగ్గులను కప్పుకొనే ముందు మరో బెడ్‌షీట్‌ను బెడ్‌రోల్ కిట్‌లో అందిస్తున్నామని తెలిపారు.

    పరిశుభ్రతను పెంచడానికి ప్రామాణిక యంత్రాలను, నిర్దేశిత రసాయనాలను ఉపయోగిస్తున్నామని, వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్
    Jr.NTR Birthday: లంబోర్గినీ నుంచి పోర్షే వరకు తారక్ గ్యారేజ్'లో కార్లు ఇవే..  జూనియర్ ఎన్టీఆర్
    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025