NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / IIT Bombay:ప్రొఫెసర్,స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు 
    తదుపరి వార్తా కథనం
    IIT Bombay:ప్రొఫెసర్,స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు 
    IIT Bombay : ఐఐటీ బాంబే విద్యార్థుల సంచలన ఆరోపణలు..పాలస్తీనాకు ప్రొఫెసర్,స్పీకర్ మద్దతు

    IIT Bombay:ప్రొఫెసర్,స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 10, 2023
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్యాంపస్ పరిధిలో వ‌ర్చువ‌ల్ లెక్చ‌ర్ సంద‌ర్భంగా ఓ ప్రొఫెస‌ర్‌, గెస్ట్ స్పీక‌ర్‌ పాల‌స్తీనా-హమాస్ ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడడంతో ఐఐటీ బాంబే విద్యార్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

    ఈ నెల 6న వ‌ర్చువ‌ల్ లెక్చ‌ర్ సంద‌ర్భంగా ఉగ్రవాదులకు మ‌ద్దతుగా ప్రొఫెస‌ర్‌, స్పీక‌ర్‌ల‌ మాట్లాడారని, ఈ మేరకు వారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విద్యార్థులు డిమాండ్ చేశారు.

    ఇజ్రాయెల్‌, పాల‌స్తీనా మిలిటెంట్ గ్రూప్ హ‌మాస్ మ‌ధ్య గత నెల రోజులుగా భీక‌ర యుద్ధం కొన‌సాగుతున్న వేళ ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

    details

    దేశ భద్రతా చర్యలకు విఘాతం కలిగేలా మాట్లాడారు : విద్యార్థులు

    భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబేకు చెందిన హ్యుమ‌నిటీస్, సోష‌ల్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెస‌ర్ శ‌ర్మిష్ట సాహా, అకాడెమిక్ కోర్సు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథి లెక్చరర్ గా సుధాన్వ దేశ్‌పాండే హాజరయ్యారు.

    అయితే రాడిక‌ల్ లెఫ్టిస్ట్ దేశ్‌పాండేను, ప్రొఫెసర్ శ‌ర్మిష్ట త‌న ప‌ద‌విని ఉపయోగించి పాండేను గెస్ట్ స్పీక‌ర్‌గా ఆహ్వానించార‌ని విద్యార్ధులు ఫిర్యాదులో వివరించారు.

    పాల‌స్తీనా ఉగ్ర‌వాదులు జ‌కారియా జుబేది, ఘ‌స‌న్ క‌న‌ఫ‌నిల‌ను దేశ్‌పాండే గొప్ప‌గా కీర్తించడం, సాయుధ తిరుగుబాటును స‌మ‌ర్ధించారని విద్యార్ధులు లేఖలో రాశారు.

    ఉగ్ర‌వాద సిద్ధాంతాల‌ను విద్యార్థులకు నూరి పోస్తున్నారని, ఈ క్రమంలోనే ప్రేరేపిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడ‌టం భ‌ద్ర‌తా ముప్పుకు దారి తీసే ప్ర‌మాదం ఉంద‌న్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యార్థులు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    విద్యార్థులు

    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ తూర్పుగోదావరి జిల్లా
    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి  తాజా వార్తలు
    అంతర్జాతీయ వేదికపై సంగారెడ్డి విద్యార్థి ప్రతిభ; జీ20 సదస్సులో నమూనా ప్రదర్శన తెలంగాణ
    ఏపీ, తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల ఎప్పుడంటే? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025