NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
    తదుపరి వార్తా కథనం
    ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
    1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

    ఐఎండీ హెచ్చరిక: ఫిబ్రవరిలోనే దంచికొట్టిన ఎండలు; 1901 తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

    వ్రాసిన వారు Stalin
    Mar 01, 2023
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ వేసవిలో ఎండలు మండిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఫిబ్రవరి నెలలోనే గత 122 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. ఫిబ్రవరిలో అత్యధికంగా 29.54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు, 1901 తర్వాత ఆ స్థాయిలో ఎండలు కొట్టడం ఇదే తొలిసారని పేర్కొంది.

    అంతేకాదు మార్చి, ఏప్రిల్, మే నెల్లలోని ఎండల తీవ్రతను కూడా ఐఎండీ అంచనా వేసింది.

    ఈశాన్య, తూర్పు, మధ్య,వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

    ఎండల తీవ్రత నేపథ్యంలో ఉపశమనం కోసం 'ఏం చేయాలి, ఏం చేయకూడదు' అనే జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

    ఎండలు

    విద్యుత్ నెట్‌వర్క్‌, పంటలపై తీవ్ర ప్రభావం

    అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యుత్ నెట్‌వర్క్‌పై భారం పడుతుంది.

    సాధారణ ఉష్ణోగ్రత స్థాయిలతో పోలిస్తే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కాలాన్ని హీట్‌వేవ్‌గా వర్గీకరిస్తారు. 2015- 2020 మధ్య హీట్‌వేవ్‌ల వల్ల ప్రభావితమైన రాష్ట్రాల సంఖ్య 23కి పెరిగింది. అంటే రెండింతలు పెరిగింది.

    దేశవ్యాప్తంగా నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు 1901 తర్వాత ఫిబ్రవరి నెలలో అత్యధికంగా నమోదయ్యాయి.

    ఎండలు పంట దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణుపు చెబుతున్నారు. ముఖ్యంగా గోధుమ పంట దిగుబడి భారీ తగ్గే అవకాశం ఉంది.

    చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా భారతదేశం ఉంది. ఈ క్రమంలో ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం చూపనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వేసవి కాలం
    భారతదేశం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    వేసవి కాలం

    National Strawberry Day 2023: స్ట్రాబెర్రీలతో ఈ రెసిపీలు ట్రై చేస్తే టేస్ట్ అదుర్స్ రెసిపీస్

    భారతదేశం

    భవిష్యత్‌లో భారత్‌కు భారీ భూకంపాల ముప్పు ; నిపుణుల హెచ్చరిక భూకంపం
    R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ బి ఎం డబ్ల్యూ
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి జియో
    లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025