NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు 
    తదుపరి వార్తా కథనం
    ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు 
    ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు

    ఐఎండీ హెచ్చరికలు; ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; హిమాచల్‍‌లో 122కు చేరిన మృతులు 

    వ్రాసిన వారు Stalin
    Jul 18, 2023
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నైరుతి రుతుపవనాలు ఈ వారంలో కీయాశీల దశకు చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.

    జులై 21 వరకు పలు రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.

    ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, మంగళవారం మరో వాయుగుండం ఏర్పడనుంది.

    దీని వల్ల భారీ వర్షాలు కురుస్తాయని, మధ్య భారతం, ద్వీపకల్ప ప్రాంతాలు వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడుతాయని ఐఎండీ తెలిపింది.

    ఐఎండీ

    మహారాష్ట్రలోని పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ

    మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో రాయ్‌గఢ్, పూణే జిల్లాల్లో జులై 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

    పాల్ఘర్, థానే, ముంబై, సింధుదుర్గ్, జల్గావ్, కొల్హాపూర్, సతారా, ఔరంగాబాద్, జల్నా, అకోలాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

    దిల్లీలో మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి యమునా నీటి మట్టం 205.71 మీటర్లకు చేరుకుంది.

    ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    రాష్ట్రంలో జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి వరదల కారణంగా 122 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఐఎండీ

    డెహ్రాడూన్‌లో ఎల్లో అలర్ట్ జారీ

    అదేవిధంగా, తూర్పు రాజస్థాన్‌లో జూలై 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్‌లలో జులై 17, 18 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ తదితర జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. కుమావోన్ ప్రాంతంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

    భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్ సహా గర్వాల్ ప్రాంతంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మరో 5రోజుల పాటు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

    జులై 18, 19లో అండమాన్, నికోబార్ దీవులలోనూ వర్షాలు పడనున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

    ఐఎండీ

    ఈశాన్య భారతంలో మురో మూడు రోజులు భారీ వర్షాలు

    గోవా, కొంకణ్‌లలో మంగళవారం నుంచి రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.

    మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో జూలై 18 నుంచి 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయి. గుజరాత్‌లో జులై 19 నుంచి 21 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

    వచ్చే మూడు రోజుల్లో అసోం, మేఘాలయ, త్రిపురలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జూలై 21 వరకు కర్ణాటకలోని తీరప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరుగా వర్షాలు కురవనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎండీ
    భారీ వర్షాలు
    హిమాచల్ ప్రదేశ్
    నైరుతి రుతుపవనాలు

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    ఐఎండీ

    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ
    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా భారతదేశం

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  ఉత్తరాఖండ్
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    నైరుతి రుతుపవనాలు

    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  వర్షాకాలం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  వర్షాకాలం
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025