NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Govt : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!
    తదుపరి వార్తా కథనం
    AP Govt : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!
    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!

    AP Govt : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నుంచి కీలక నిర్ణయం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

    రేపు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

    ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వినతులు, సూచనలు అందించనున్నాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం తుది నివేదికను అధికారులు సిద్ధం చేయనున్నారు.

    అలాగే ఇంజినీరింగ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ శాఖల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో ఇతర శాఖల్లో ఉద్యోగుల బదిలీపై ఆన్‌లైన్ ఓటింగ్ కొన్ని ఉద్యోగ సంఘాలు నిర్వహిస్తున్నాయి.

    Details

    మూడు కేటగిరీలుగా విభజన

    ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా విభజించింది.

    ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విధంగా రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.

    2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలకు - A కేటగిరీ (6 మంది ఉద్యోగులు)

    3,500 జనాభా వరకు ఉన్న సచివాలయాలకు - B కేటగిరీ (7 మంది ఉద్యోగులు)

    3,500 పైగా జనాభా ఉన్న సచివాలయాలకు - C కేటగిరీ (8 మంది ఉద్యోగులు)

    ఈ విభజన కారణంగా దాదాపు 40,000 మంది ఉద్యోగులు మిగిలిపోయారు. వారిని ఇతర శాఖల్లో వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: ఈ నెల 30నుంచి ఏపీలో వాట్సప్‌ గవర్నెన్స్‌ సేవలు.. సీఎం చంద్రబాబు నిర్ణయం  భారతదేశం
    Andhra pradesh: విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా మెట్రో రైలు
    WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం.. వాట్సప్ నంబర్ కేటాయించిన ప్రభుత్వం.. భారతదేశం
    Andhra pradesh: నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్‌ విలువలు.. కొన్నిచోట్ల తగ్గింపు.. మరికొన్ని చోట్ల యథాతథం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025