NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా 
    తదుపరి వార్తా కథనం
    ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా 
    ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా

    ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా 

    వ్రాసిన వారు Stalin
    Oct 10, 2023
    05:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్న పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

    రాఘవ్ చద్దా పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించనుంది.

    ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన ఉత్తర్వులను అక్టోబర్ 6న పాటియాలా హౌస్ కోర్టు సమర్థించింది.

    చద్దా వెంటనే బంగ్లాను ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా బంగ్లాను ఖాళీ చేయవద్దని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా కోర్టు ఉపసంహరించుకుంది.

    దిల్లీ

    ప్రభుత్వ బంగ్లా వివాదం ఇదే..

    ప్రస్తుతం పంజాబ్ నుంచి రాజ్యసభలో రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

    చద్దా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. రాజ్యసభ ఎంపీ అయిన చద్దాకు సెక్రటేరియట్ పొరపాటున పండరా రోడ్‌లోని టైప్-7 బంగ్లాను కేటాయించింది.

    అయితే నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఫ్లాట్‌లను మొదటిసారి ఎంపీలకు కేటాయించరు.

    రాజ్యసభ సెక్రటేరియట్ తన తప్పును గుర్తించిన వెంటనే, బంగ్లాను ఖాళీ చేయమని రాఘవ్ చద్దాకు ఆదేశాలు జారీ చేసింది.

    కానీ, ఒకసారి బంగ్లా కేటాయిస్తే తాను 6 ఏళ్ల పాటు ఎంపీగా ఉంటానని, అప్పటి వరకు బంగ్లాను ఖాళీ చేయలేనని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుల దాకా వెళ్లింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    పంజాబ్
    రాజ్యసభ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    దిల్లీ

    G-20 సమావేశం: ప్రపంచ దేశాధినేతల బస ఇక్కడే..ఏ హోటల్లో ఎవరు ఉంటారో తెలుసా ప్రపంచం
    G-20 SUMMIT : దిల్లీలో మూడు కూటముల ప్రపంచ అతిపెద్ద శిఖరాగ్ర సమావేశం భారతదేశం
    సతీసమేతంగా దిల్లీకి చేరిన రిషి సునక్​కు ఘన స్వాగతం​.. పర్యటన తనకెంతో స్పెషల్​ అన్న ఇంగ్లీష్ ప్రధాని బ్రిటన్
    10వేల అడుగుల ఎత్తులో G20 జెండాతో IAF అధికారి అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్ ఇండియా

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    దిల్లీ మద్యం కుభకోణం: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్‌ను ప్రశ్నించిన ఈడీ దిల్లీ
    Delhi Excise Policy Scam: నేను జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడను: మనీష్ సిసోడియా దిల్లీ
    దిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: సిసోడియా అరెస్టుపై ఆప్ నిరసనలు; బీజేపీ హెడ్ క్వార్టర్ వద్ద హై టెన్షన్ దిల్లీ

    పంజాబ్

    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు అమృత్‌సర్
    అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్  అమృత్‌సర్
    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  ఖలిస్థానీ
    పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి  ఆర్మీ

    రాజ్యసభ

    గాంధీలకు నెహ్రూ ఇంటి పేరు అంటే భయమెందుకు?: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు లోక్‌సభ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025