NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు
    తదుపరి వార్తా కథనం
    Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు
    చిరాగ్, పశుపతిని కలిపిందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు

    Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు

    వ్రాసిన వారు Stalin
    Jul 17, 2023
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌కు చెందిన లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో చీలికను నిరోధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

    2024లోక్‌సభ ఎన్నికలలో ఓట్లను చీలకుండా ఉండేందుకు ఎల్‌జేపీకి చెందిన రామ్‌విలాస్‌ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వర్గం, ఆయన తమ్ముడు పశుపతి కుమార్ పారస్ వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావాలని భావిస్తోంది.

    అయితే ఈ రెండు వర్గాలు కూడా తమ విభేదాలను పక్కన పెట్టేందుకు సిద్ధంగా లేవని తెలుస్తోంది.

    కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల చిరాగ్, పశుపతితో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.

    వచ్చే ఎన్నికల కోసం ఇద్దరు కలిసి పనిచేయాలని కోరారు. ఈ క్రమంలో తన వర్గానికి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వాలని చిరాగ్ కోరడంతో అందుకు నిత్యానంద్ ససేమీరా అన్నారు. దీంతో నిత్యానంద్ రాయబారం విఫలమైంది.

    బీజేపీ

    రామ్ విలాస్ మరణం తర్వాత రెండుగా చీలిన పార్టీ

    రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చింది.

    అక్టోబర్ 2020లో పాశ్వాన్ మరణించారు. దీంతో రామ్ విలాస్ పాశ్వాన్ తమ్ముడు పశుపతి తిరుగుబాటు చేసి తన వర్గంతో ఎన్‌డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ పరిణామంతో జూన్ 2021లో ఎల్‌జేపీ రెండుగా చీలిపోయింది.

    ఇప్పడు చిరాగ్, పశుపతి వర్గాలు రామ్ విలాస్ కంచుకోట అయిన హాజీపూర్ లోక్‌సభ స్థానం కోసం పోరాడుతున్నాయి.

    2019 లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానంలో రామ్ విలాస్ తన తమ్ముడు పశుపతిని పోటీలో నిలపగా, ఆయన గెలుపొందారు. అదే ఎన్నికల్లో చిరాగ్ జముయి స్థానం ఎంపీగా విజయం సాధించారు.

    బీజేపీ

    జులై 18న జరిగే మెగా మిత్రపక్షాల సమావేశానికి చిరాగ్‌ను ఆహ్వానించిన బీజేపీ

    రామ్ విలాస్ పాశ్వాన్‌కు దళిత నాయకుడిగా చాలా గొప్ప పేరుంది. ఆ సామాజికవర్గం మద్దతుతోనే దశాబ్దాలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు.

    ఈ క్రమంలో రామ్ విలాస్ పాశ్వాన్‌ మరణం తర్వాత ఆయన పేరుతో ప్రస్తుతం చిరాగ్, పశుపతి రాజకీయం చేస్తున్నారు.

    వచ్చే ఎన్నికల్లో చిరాగ్, పశుపతి వేర్వేరుగా పార్టీలుగా పోటీ చేస్తే దళిత ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.

    దీంతో ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకు బాబాయ్, అబ్బాయ్‌ని కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

    చిరాగ్ శిబిరాన్ని ఆకర్షించడానికి, బీజేపీ అతనికి కేంద్రమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.

    అలాగే జులై 18న మిత్రపక్షాలతో జరిగే మెగా సమావేశంలో పాల్గొనాల్సిందిగా చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ ఆహ్వానించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తాజా వార్తలు

    తాజా

    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    తాజా వార్తలు

    పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు పశ్చిమ బెంగాల్
    Ambati Rayudu: వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాయుడు కౌంటర్  ఆంధ్రప్రదేశ్
    భారత్‌లో గత 15ఏళ్లలో 41.5కోట్ల మంది పేదరికాన్ని జయించారు: ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి
    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025