NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు
    తదుపరి వార్తా కథనం
    Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు
    మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు

    Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 17, 2024
    01:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం సమీపంలోని గురందొరపాలెంలో ఇంటి మొదటి అంతస్థు నుంచి కింద పడిన మీసాల నాగేశ్వరరావు (39) అనే వ్యక్తికి కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

    పుల్ల మెదడు కింది భాగంలోకి చేరడంతో బాధితుడు చూపు కోల్పోయాడు.

    ఈ విషయమై KGH ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ, "12 అంగుళాల చెక్క పుల్ల నాగేశ్వరరావు కుడి కంటికి గుచ్చుకుందన్నారు. ఆ పుల్ల అతని మెదడు దిగువ భాగానికి చేరుకుందన్నా ఆయన.. దీని ఫలితంగా, అతడు వెంటనే తన దృష్టిని కోల్పోయాడని తెలిపారు.

    జూన్ 5న అతడిని కేజీహెచ్‌ లో చికిత్స నిమిత్తం చేర్పించారు.

    వివరాలు 

    జూన్ 6న ఆపరేషన్

    వైద్యులు, నేత్ర వైద్య నిపుణులు, న్యూరో సర్జన్లు, ఆర్థోపెడిక్ వైద్యులు, ఈఎన్‌టీ వైద్యులు, మత్తు వైద్యుల బృందం అతడిని పరీక్షించి పుల్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు.

    స్కానింగ్, రక్తపరీక్షలు, ఎక్స్ రే తదితర అన్ని పరీక్షలు నిర్వహించి, రోగి అంగీకారం తెలపడంతో జూన్ 6న ఆపరేషన్ నిర్వహించారు.

    ఆపరేషన్ విజయవంతమైంది. రోగికి హై-ఎండ్ యాంటీబయాటిక్స్, ఐసియు కేర్ ఇచ్చారు. అతడిని అబ్జర్వేషన్ లో ఉంచారు. అతని రికవరీ రేటు 100% గా ఉంది.

    వివరాలు 

    కళ్ళకు శారీరక గాయం అయిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు 

    మీరు అనుకోకుండా మీ కళ్ళకు ఏదైనా జరిగితే ముందుగా, గాయం ఎంత తీవ్రమైందో చూడాలి.

    ఆ గాయం మిమ్మల్ని చాలా బాధిస్తున్న లేదా మీ దృష్టి మందగించిన లేదా మీ కంటిలో ఏదైనా పడినట్లు అనిపించినా వెంటనే వైద్యుడిని సందర్శించండి.

    మీ కంటిపై రుద్దడం లేదా ఒత్తడం చెయ్యకండి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

    మీ కంటిలో ధూళి లేదా మరేదైనా ఉంటే, దానిని శుభ్రమైన నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోండి.

    మీరు డాక్టర్‌ను చూసే వరకు మీ గాయపడిన కంటిని శుభ్రమైన గుడ్డ తో కప్పండి. గాయం చిన్నదిగా అనిపించినప్పటికీ, వైద్యుడిని సందర్శించడం మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    విశాఖపట్టణం

     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం హైదరాబాద్
    విశాఖ చరిత్ర తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి వైజాగ్
    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  రైల్వే శాఖ మంత్రి
    వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు  ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025