NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
    ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
    భారతదేశం

    ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2023 | 04:50 pm 1 నిమి చదవండి
    ఎన్ కౌంటర్ మధ్యలో ముష్కరుల దొంగదెబ్బ.. ఐదుగురు ఆర్మీజవాన్లు మృతి
    ఆర్మీ జవాన్లు

    జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారు జరిపిన బాంబు పేలుడులో ఐదురుగు జవాన్లు మృత్యువాత పడ్డారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజౌరీ జిల్లాలోని కాండి అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. మంగళవారం జమ్ముప్రాంతంలో భాటా ధురియన్ కు చెందిన తోటగాలి ప్రాతంలో ఆర్మీ ట్రక్ పై ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ ఘటనకు పాల్పడిన వారు కాండి ఫారెస్టులోని ఓ గుహలో ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా ఆర్మీకి సమాచారం అందింది. దీంతో గురువారం నుంచి బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే శుక్రవారం ఉదయం ఉగ్రవాదుల జాడ గుర్తించడంతో రెండు వైపులా ఎన్ కౌంటర్ మొదలైంది. అక్కడి నుంచి తప్పించుకోవాడానికి ఉగ్రవాదాలు పేలుడు పదార్థాలను వాడారు.

    ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

    ఈ ఘటనలో ఐదురుగు జవాన్లు మరణించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉదంపూర్ లోని కమాండ్ ఆస్పత్రికి తరలించారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి రాజౌరీ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. 2021 అక్టోబర్‌లో రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు మరణించిన తర్వాత ఈ ఘటన మళ్లీ చోటు చేసుకోవడం బాధాకరం. పుంజ్ జిల్లాలో జరిగిన దాడితో సంబంధమున్న ఉగ్రవాదుల కదలికలపై గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ ఘాతానికి పాల్పడ్డారని అధికారులు ధ్రువీకరించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఆర్మీ
    ఉగ్రవాదులు

    ఆర్మీ

    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? మణిపూర్
    అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు అమెరికా
    ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ  జమ్ముకశ్మీర్
    ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి  జమ్ముకశ్మీర్

    ఉగ్రవాదులు

    జమ్ముకశ్మీర్‌‌లో మరో ఎన్‌కౌంటర్‌- ఇద్దరు ఉగ్రవాదులు హతం  జమ్ముకశ్మీర్
    సిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన  సిరియా
    తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం  ఆఫ్ఘనిస్తాన్
    అమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం సిరియా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023