NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: అనౌన్స్‌మెంట్‌ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    Delhi: అనౌన్స్‌మెంట్‌ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు
    అనౌన్స్‌మెంట్‌ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు

    Delhi: అనౌన్స్‌మెంట్‌ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైళ్ల పేర్లలో గందరగోళమే ప్రధాన కారణంగా ఉందని పోలీసులు తెలిపారు.

    ప్రయాణికులు తికమకపడటంతో ఆపరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. నిన్న రాత్రి తొలుత ప్రయాగ్‌రాజ్‌ స్పెషల్‌ రైలు ప్లాట్‌ఫామ్‌ నెంబర్‌ 16 వద్దకు రానుందని అనౌన్స్‌మెంట్‌ చేశారు.

    ఇదే సమయంలో ప్రయాగ్‌రాజ్‌ ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే 14వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్ వద్ద నిలిచివుంది.

    దీంతో కొందరు తాము ఎక్కాల్సిన రైలు ఇదేనని భావించి అక్కడకు చేరుకున్నారు.

    అయితే అనౌన్స్‌మెంట్‌ విన్న తరువాత అసలైన రైలు 16వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వద్దకు వస్తుందని తెలుసుకొని భయాందోళనకు గురయ్యారు. దాన్ని అందుకోవాలని వందల మంది 16వ ప్లాట్‌ఫామ్‌ వైపు పరుగులు పెట్టారు.

    Details

    రాత్రి 10 గంటల సమయంలో ఘటన

    ఈ సమయంలో 12, 13, 14 ప్లాట్‌ఫారాలు ఇప్పటికే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దీనికి తోడు 16వ ప్లాట్‌ఫామ్‌ వైపు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది.

    ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే నాలుగు రైళ్లలో మూడు ఆలస్యమవడం కూడా ఈ గందరగోళానికి కారణమైంది. దీంతో చాలా మంది 14వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని మరింత దిగజార్చారు.

    ఘటనపై ఒక ప్రయాణికుడు స్పందిస్తూ తన జీవితంలో ఇంతమంది జనాన్ని ఒకే స్టేషన్‌లో చూడలేదని, అధికారులు అక్కడే ఉన్నా, ప్రయాణికుల సంఖ్యను నియంత్రించలేకపోయారని తెలిపారు.

    ఈ తొక్కిసలాట రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం?  ఆర్ బి ఐ
    Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా  మంగోలియా
    Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి తెలంగాణ
    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం

    దిల్లీ

    Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట భారతదేశం
    AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ అరవింద్ కేజ్రీవాల్
    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం
    Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి.. ఆప్ బీజేపీపై ఆరోపణలు అరవింద్ కేజ్రీవాల్

    ఇండియా

    Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు వినియోగం రికార్డు స్థాయికి హైదరాబాద్
    KTR : కేటీఆర్ లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Kerala: కేరళలో దారుణం.. 18 ఏళ్ల అథ్లెట్‌పై 60 మందికి పైగా లైంగిక వేధింపులు కేరళ
    Branded houses: హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న బ్రాండెడ్ గృహాలు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025