NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం 
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం 
    విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం

    Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 04, 2024
    04:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి.

    100 ఫైరింజన్లు, 2100 మంది సిబ్బందితో బురద తొలగింపు పనులు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

    బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఏ సహాయం అవసరమైతే అక్కడ తక్షణమే సాయమందిస్తామని భరోసా ఇచ్చారు.

    62 మెడికల్ క్యాంపులు, 2,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది, పక్లెయిన్లు, టిప్పర్లు వంటి పరికరాలు సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

    సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 32 మంది ఐఏఎస్‌లు, 179 సీనియర్ అధికారులను సచివాలయాల ఇన్‌ఛార్జులుగా నియమించారు.

    వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

    Details

    వరదలు రావడానికి కారణం 'బుడమేరు'

    వరద బాధితులకు సహాయం అందించడానికి, మంగళవారం రోజున 9,09,191 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయగా, ఈ రోజు 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు చంద్రబాబు చెప్పారు.

    అదనంగా, 8.50 లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు కూడా అందించామన్నారు.

    సీఎం చంద్రబాబు విజయవాడలో వరదల ప్రధాన కారణంగా బుడమేరు వాగును గుర్తించారు.

    కృష్ణానది, బుడమేరు వాగు కలిసి నగరాన్ని ముంచెత్తాయని, గత ప్రభుత్వ కాలంలో బుడమేరు ప్రాజెక్ట్‌ పై సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

    రేపు ఉదయానికి వరద పరిస్థితి పూర్తిగా మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    వరదలు

    తాజా

    Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    IPL 2025: స్టార్క్‌ ఔట్‌.. హేజిల్‌వుడ్‌ ఇన్‌! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Zomato Gold and Swiggy One: జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్.. జొమాటో
    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది

    చంద్రబాబు నాయుడు

    Andhrapradesh: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు  భారతదేశం
    Chandrababu: చంద్రబాబు క్యాబినెట్‌లో కులాల సమతూకం .. ఏఏ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయో తెలుసా?  భారతదేశం
    Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు..  మెగా Dsc ఫైలుపై తోలి సంతకం   భారతదేశం
    CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష  పోలవరం

    వరదలు

    అసోంలో ముంచెత్తుతున్న వానలు; వరదల్లో చిక్కుకున్న 1.2లక్షల మంది   అస్సాం/అసోం
    అసోంలో వరదల బీభత్సం; 22 జిల్లాలు జలమయం; ఒకరు మృతి అస్సాం/అసోం
    నైరుతి విస్తరణతో దేశమంతటా భారీ వర్షాలు.. వరదలో చిక్కుకున్న హిమాచల్ వాసులు  హిమాచల్ ప్రదేశ్
    ఉత్తరాదిలో కుంభవృష్టి.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025