NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
    తదుపరి వార్తా కథనం
    MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు
    ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

    MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 24, 2025
    04:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కీలక మార్పులు చేసింది. పార్లమెంట్ సభ్యుల నెల జీతాన్ని ప్రస్తుతం ఉన్న రూ.1,00,000 నుంచి రూ.1,24,000కి పెంచింది.

    అలాగే, డైలీ అలవెన్సెస్‌ను రూ.2,000 నుంచి రూ.2,500కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

    మాజీ సభ్యుల పెన్షన్ విషయానికి వస్తే, ప్రస్తుతం వారికి నెలకు రూ.25,000 పెన్షన్ అందుతుండగా, దాన్ని రూ.31,000కి పెంచింది.

    అదనపు పెన్షన్‌లోనూ మార్పులు చేస్తూ, రూ.2,000 నుంచి రూ. 2,500కి పెంచింది. ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.

    Details

    కర్ణాటకలో 100శాతం పెంపు

    ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను 100శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం నెల జీతం రూ.1,00,000 ఉండగా, పెంపుతో అది రూ.2,00,000కి పెరిగింది. ఈ నిర్ణయం అసెంబ్లీలో చర్చకు దారి తీసింది.

    ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా టికీ, ప్రభుత్వ నాయకులు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

    ఈ విషయంలో కర్ణాటక హోం మినిస్టర్ జి. పరమేశ్వర స్పందిస్తూ, "సాధారణ ప్రజల ఖర్చులు పెరుగుతున్నట్లే ప్రజా ప్రతినిధుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.

    ఓ ఎమ్మెల్యే కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతాడు. అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరూ బతకాలి కదా అని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన భారతదేశం
    Donald Trump: భారత్-పాక్ కాల్పుల విరమణను అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ పోస్టు డొనాల్డ్ ట్రంప్
    IPL 2025: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కేంద్రంగా ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు? ఐపీఎల్
    BLA: పాక్‌కు మరో ఎదురు దెబ్బ.. 39 ప్రాంతాల్లో బలూచిస్థాన్ మెరుపుదాడులు పాకిస్థాన్

    కేంద్ర ప్రభుత్వం

    Andra Pradesh: ఏపీకి 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.446 కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్
    Tax Relief: 10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు.. గుడ్‌న్యూస్‌ చెప్పేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం  బిజినెస్
    Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం మన్మోహన్ సింగ్
    HMPV: భారత్‌లో హెచ్ఎంపీవీ కేసుల పెరుగుదలతో కేంద్రం అలర్ట్.. రాష్ట్రాలకు కీలక సూచనలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025