NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
    తదుపరి వార్తా కథనం
    Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
    2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం

    Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం

    వ్రాసిన వారు Stalin
    Aug 15, 2023
    11:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Independence Day Modi Speech: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.

    2024ఎన్నికలే లక్ష్యంగా మోదీ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిపక్షాలపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

    2024లో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో తానే జెండాను ఆవిష్కరిస్తానని చెప్పిన మోదీ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేసారు. ప్రియమైన 140కోట్ల కుటుంబ సభ్యులారా అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

    ప్రజలను తన తోటి పౌరులుగా కాకుండా తన కుటుంబ సభ్యులంటూ సంబోధించారు. తద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు.

    90మినిషాల పాటు సాగిన మోదీ ప్రసంగంలో 26సార్లు ప్రజలను కుటుంబ సభ్యులుగా పేర్కొన్నారు.

    మోదీ

    ఈ మూడే దేశాన్ని నాశనం చేశాయి: మోదీ

    ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తన జీవిత లక్ష్యంగా మోదీ చెప్పారు.

    మూడు అంశాలే దేశాన్ని సర్వనాశనం చేశాయని మోదీ చెప్పారు. ఒకటి అవినీతి, రెండు రాజవంశ రాజకీయాలు, మూడోది బుజ్జగింపు రాజకీయాలుగా మోదీ వివరించారు.

    వారసత్వ రాజకీయాలు ప్రజల హక్కులను కాలరాసినట్లు మోదీ పేర్కొన్నారు. బుజ్జగింపు రాజకీయాలు దేశంపై మాయని మచ్చగా మిగిలిపోయినట్లు వెల్లడించారు.

    ఈ మూడు దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

    తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను నా ప్రభుత్వం తొలగించినట్లు మోదీ పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల స్వాధీనం 20 రెట్లు పెరిగినట్లు మోదీ చెప్పారు.

    మోదీ

    రాబోయే ఐదేళ్లు చాలా కీలకం: మోదీ

    స్వాతంత్ర్య దినోత్సవ 100ఏళ్ల లక్ష్యాలను చేరుకోవాలంటే రాబోయే ఐదేళ్లు చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు.

    2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద రక్షణ కవచంలా నిలుస్తాయని చెప్పారు. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్ అవతరించడం అనేది కేవలం కల మాత్రమే కాదని, అది 140 కోట్ల మంది భారతీయుల ప్రతిజ్ఞగా మోదీ వివరించారు.

    డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విజయవంతం చేయడంలో యువత అందిస్తున్న సహకారాన్ని మోదీ ప్రశంసించారు.

    గత సంవత్సరం బాలిలో జరిగిన జీ20 సమ్మిట్‌లో భారత సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకున్నట్లు మోదీ గుర్తుచేశారు.

    మోదీ

    3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతా:మోదీ

    ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థపై ప్రత్యకంగా మాట్లాడారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్నట్లు మోదీ గుర్తు చేశారు.

    నేడు 140 కోట్ల మంది భారతీయుల కృషితో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దేశంలో అవినీతి అవినీతి భూతాన్ని అరికట్టడం వల్లే బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించినట్లు మోదీ స్పష్టం చేశారు.

    రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని తాను హామీ ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు.

    'అమృత్ కాల్'లో జీవించడం అందరి అదృష్టంగా మోదీ పేర్కొన్నారు. ఈ 'అమృత్ కాల్'లో తీసుకునే నిర్ణయాలు రాబోయే సహస్రాబ్ది ఉత్సవాల లక్ష్యాలను ప్రతిబింబిస్తాయని మోదీ అన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: మోదీ

    I firmly believe that in 2047, when the country will celebrate 100 years of independence, India will become a developed nation: PM @narendramodi#IndependenceDay#IndependenceDay2023 pic.twitter.com/xIwgUuS9FM

    — PIB India (@PIB_India) August 15, 2023

    మోదీ

    కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపే డబ్బు రూ.100లక్షల కోట్లకు పెరిగింది: మోదీ

    కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపే డబ్బు రూ.30లక్షల కోట్ల నుంచి రూ.100లక్షల కోట్లకు పెరిగిందని మోదీ చెప్పారు.

    మున్సిపల్ బాడీలకు రూ.70,000కోట్ల నుంచి రూ. 3లక్షల కోట్లకు చెరుకున్నట్లు పేర్కొన్నారు.

    పేదల ఇళ్లపై ఇప్పుడు రూ.4లక్షల కోట్లకు పైగా తాము ఖర్చు చేస్తున్నట్లు మోదీ వివరించారు.

    రైతులకు యూరియా సబ్సిడీపై కేంద్రం దాదాపు రూ.10లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

    ముద్రా యోజన కింద ప్రజల స్వయం ఉపాధి కోసం 20లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

    దాదాపు 8 కోట్ల మంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారని చెప్పారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం కోసం ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు మోదీ స్పష్టం చేశారు.

    మోదీ

    మహిళల నేతృత్వంలో అభివృద్ధి: మోదీ

    మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ప్రాముఖ్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. చంద్రయాన్ మిషన్‌కు మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారని వివరించారు.

    పౌర విమానయాన రంగంలో అత్యధిక మహిళా పైలట్‌లను భారత కలిగి ఉందని మోదీ చెప్పారు.

    'డ్రెమొగ్రఫీ, డెమొక్రసీ, డైవర్సిటీ' ఈ త్రివేణి భారతదేశం అన్ని కలలను నెరవేస్తుందని మోదీ స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనలో తన ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

    గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మహిళల ప్రాముఖ్యతపై మోదీ ప్రసంగం

    The one thing that will take the country forward is women-led development. Today, we can proudly say that India has the maximum number of pilots in civil aviation.

    Women scientists are leading the #Chandrayaan mission. The #G20 countries are also recognising the importance of… pic.twitter.com/yjXR697X5T

    — PIB India (@PIB_India) August 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    స్వాతంత్య్ర దినోత్సవం
    తాజా వార్తలు

    తాజా

    PM Modi: గుల్జార్‌హౌస్‌ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి నరేంద్ర మోదీ
    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి

    నరేంద్ర మోదీ

    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక  భారతదేశం
    రెండో రోజూ రూల్స్ 267, 176లపై దుమారం.. ప్రధానికి ఖర్గే ఘాటు ప్రశ్నలు మల్లికార్జున ఖర్గే
    PM Modi: యూపీఏ 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్'తో దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ విచ్ఛిన్నం: ప్రధాని మోదీ  యూపీఏ

    స్వాతంత్య్ర దినోత్సవం

    Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం  తాజా వార్తలు
    'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ ఐడియా
    Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే  భారతదేశం
    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు ప్రధాన మంత్రి

    తాజా వార్తలు

    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు రోజా సెల్వమణి
    మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా  అమిత్ షా
    ఆగస్టు 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025