Page Loader
India Bloc: బడ్జెట్‌కు వ్యతిరేకంగా భారత కూటమి నేడు పార్లమెంట్‌లో నిరసన
బడ్జెట్‌కు వ్యతిరేకంగా భారత కూటమి నేడు పార్లమెంట్‌లో నిరసన

India Bloc: బడ్జెట్‌కు వ్యతిరేకంగా భారత కూటమి నేడు పార్లమెంట్‌లో నిరసన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2024
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలపై "వివక్ష"పై పార్లమెంట్‌, వెలుపల నిరసన తెలియజేయాలని ఇండియా కూటమి పార్టీలు మంగళవారం నిర్ణయించాయి. మంగళవారం సాయంత్రం 10 గంటలకు రాజాజీ మార్గ్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా బ్లాక్‌ పార్టీల ఫ్లోర్‌ లీడర్‌ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, సంజయ్‌ రౌత్‌ తదితరులు హాజరయ్యారు.

వివరాలు 

కొన్ని రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్‌ వివక్ష

ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్ కూడా పాల్గొన్నారు. బడ్జెట్‌పై విపక్ష నేతలు చర్చించారు. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ వెల్లడించారు. ''బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసిందని, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీ ప్రాజెక్టులను ప్రకటించారన్నారు. ఇది బీజేపీ బడ్జెట్‌ కాదని.. దేశ బడ్జెట్‌ అంటూ సమర్థించుకుంటున్నారు. కానీ, దీనిపై రేపు పార్లమెంట్‌లో నిరసన తెలిపాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. న్యాయం కోసం పోరాడతాం'' అని ఆయన పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్‌ వివక్ష చూపుతోందంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.