LOADING...
India China Flights: ఐదేళ్ల తర్వాత,వచ్చే నెల నుండి భారత్ నుంచి చైనాకు విమాన సర్వీసులు 
ఐదేళ్ల తర్వాత,వచ్చే నెల నుండి భారత్ నుంచి చైనాకు విమాన సర్వీసులు

India China Flights: ఐదేళ్ల తర్వాత,వచ్చే నెల నుండి భారత్ నుంచి చైనాకు విమాన సర్వీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2025
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐదేళ్ల విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. వచ్చే నెలలో ఈ సర్వీసులు పునరుద్ధరించే అవకాశముందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు చైనా రూట్ల కోసం సిద్ధం కావాలని భారత ప్రభుత్వం సూచించింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ సమయంలోనే రెండు దేశాల మధ్య నేరుగా నడుస్తున్న విమాన సర్వీసులను నిలిపివేశారు.

వివరాలు 

సానుకూల వాతావరణం ఏర్పడడంతో విమాన సర్వీసుల పునరుద్ధరణకు మార్గం

అదనంగా, భారత్ చైనాకు చెందిన అనేక మొబైల్ యాప్‌లను నిషేధించింది. చైనా పెట్టుబడులపై కేంద్రం నిరాసక్తత చూపగా, చైనా నుంచి వచ్చే దిగుమతులపై కఠిన ఆంక్షలు కూడా అమలు చేసింది. ఇటీవలి కాలంలో ఇరువైపులా ఉద్రిక్తతలను తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సానుకూల వాతావరణం ఏర్పడడంతో విమాన సర్వీసుల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారత్-చైనా సంబంధాలు మెరుగుపడితే ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాలు కలిసి అమెరికాకు సవాల్ విసిరే స్థితిలోకి వచ్చే అవకాశముంది.